Don't Miss!
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
Janaki Kalaganaledu September 2nd: చివరికి దొంగలా అఖిల్ ప్లాన్.. అర్ధరాత్రి జానకి గదిలో దూరి..
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రామచంద్ర సహకారంతోనే అతని భార్య జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక జానకి చదువుకోవడానికి చివరికి అత్తగారు కూడా ఒప్పుకుంటారు. అయినప్పటికీ జనకికి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 380 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..
జెస్సితో అఖిల్ ప్రేమ, ప్రెగ్నెన్సీ
జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతాడు అని ఇంట్లో అందరూ కూడా ఎంతో నమ్మకం పెట్టుకుంటారు. ముఖ్యంగా రామచంద్ర అయితే తమ్ముడి కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు. తాను ఎలాగూ చదువుకోలేదు అని కనీసం తన తమ్ముడైన బాగా చదువుకొని మరో స్థాయికి చేరుకోవాలి అని ఎంతో నమ్మకంగా ఉంటాడు. అయితే అఖిల్ మాత్రం జెస్సీతో ప్రేమలో మునిగిపోయే ఆమెకు చివరికి కడుపు వచ్చేలా చేస్తాడు.
ఇక ఆ విషయం జెస్సి వాళ్ళ ఇంట్లో తెలియడంతో పరిస్థితి ఒక్కసారిగా సీరియస్ గా మారిపోతుంది. ఈ విషయంలో ఏదో ఒకటి ఆలోచించాలి అని జెస్సి అఖిల్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచుతుంది. కానీ అతను మాత్రం అబార్షన్ చేసుకోవాలి అని చెబుతాడు లేదంటే తాను చచ్చిపోవాల్సి ఉంటుంది అని కూడా బెదిరిస్తూ ఉంటాడు.
సాక్ష్యంగా ఫొటోలు
ఇక విషయంలో జెస్సి తీవ్రస్థాయిలో మనోవేదనకు గురి అవుతూ ఉండడంతో అప్పుడే జానకికి అసలు విషయం తెలుస్తుంది. ఇక అఖిల్ గురించి అసలు నిజం తెలుసుకున్న తర్వాత జానకి మరింత ఆగ్రహానికి గురి అవుతుంది. ఇంట్లో వాళ్ళు ఎంతో నమ్మకం పెట్టుకున్న అఖిల్ ఈ విధంగా చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అని అనుకుంటుంది.
అలాగే జెస్సి నుంచి సాక్షాలుగా కొన్ని ఫోటోలు కూడా తీసుకుంటుంది. ఇక ప్రత్యేకంగా అఖిల్ తో మాట్లాడడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా అతను జానకి నుంచి తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో అందరూ క్యారంబోర్డ్ ఆడుతుండగా అఖిల్ కూడా అక్కడ ఉంటాడు. ఇక జానకి అక్కడికి వచ్చి అఖిల్ ని సీరియస్ గా చూస్తూ ఉంటుంది. ఇక వీరిని చిన్న కోడలు మల్లికా కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుంది.
ఏదో జరుగుతుంది
అఖిల్ జానకి మధ్యలో ఏదో జరుగుతుంది అని వెంటనే ఆ విషయాన్ని కనుగొనాలని కూడా మల్లికా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తర్వాత జానకి కోసం రామచంద్ర మట్టి గాజులు తీసుకువస్తాడు. నేను స్వయంగా మీకు ఈ మట్టి గాజులు తొడుగుతాను అంటూ రామచంద్ర ప్రేమను చూపించడంతో జానకి మొదట సంతోషంగా ఫీల్ అవుతుంది.
అయితే అప్పుడే అఖిల్ కు సంబంధించిన ఆలోచనలు తన మనసులో మెదులుతూ ఉంటాయి. అఖిల్ ఎంత ప్రయత్నం చేసినా మాట్లాడడానికి దొరకడం లేదు అని అనుకుంటుంది. ఈ విషయం ఎట్టి పరిస్థితిలోనూ రామచంద్ర కు తెలియకూడదు అని జానకి ఆలోచిస్తుంది. ఇక తర్వాత జానకి రామచంద్ర ప్రేమను చూసిన మల్లికా తనకు బంగారు గాజులు కావాలి అని తన భర్తను అడుగుతుంది. ఇక ఉదయాన్నే విష్ణు కొనిస్తాను అని చెప్పడంతో మల్లిగా చాలా సంతోషంగా ఉంటుంది.
తలపట్టుకున్న అఖిల్
ఆ తర్వాత జానకికి హఠాత్తుగా ఫోన్ రావడంతో ఎవరికి కనిపించకుండా మాట్లాడాలని అనుకుంటుంది. జెస్సి ఫోన్ చేసి పరిస్థితి ఎంతవరకు వచ్చింది అని అఖిల్ తో మాట్లాడారా అని అడుగుతుంది. ఇలాంటి సెన్సిటివ్ విషయాలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.. నువ్వు టెన్షన్ పడకుండా ఉండు నేను ఏదో ఒకటి చేస్తాను జానకి భరోసా ఇస్తుంది. ఇక జానకి ఫోన్లో మాట్లాడుతున్న విషయాన్ని అఖిల్ గమనిస్తాడు. జెస్సీ మొత్తం విషయం వదినతో చెప్పేసినట్లు ఉంది అంటూ తల పట్టుకుంటాడు. ఇక తర్వాత ఎలాగైనా జానకి ఫోన్లో ఉన్న ఫోటోలను డిలీట్ చేయాలని అనుకుంటాడు. అందుకోసం జానకి రామచంద్ర పడుకున్నప్పుడు వారి గదిలోకి వెళ్తాడు.
జానకి కనిపెడుతుందా?
వెంటనే జానకి ఫోన్లో ఉందని ఫోటోలను అఖిల్ డిలీట్ చేస్తాడు. ఇక మధ్యలో జానకి లేచినప్పటికీ అతను మంచం కింద దూరి.. ఆ తర్వాత మళ్లీ వచ్చి మరికొన్ని ఫోటోలను డిలీట్ చేస్తాడు. ఇక పని పూర్తయిన తర్వాత అఖిల్ హాల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర గ్లాస్ తగిలి కింద పడిపోవడంతో అప్పుడే నీళ్లు తాగడానికి వచ్చిన తల్లి జ్ఞానాంబ అఖిల్ ను చూస్తుంది. అంతే కాకుండా ఆమె లైట్ వేయగానే అఖిల్ టెన్షన్ పడుతూ కనిపిస్తాడు.
ఎందుకు ఇంత అర్ధరాత్రి లేచావని జ్ఞానాంబ అడుగుతుంది. మీరు నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కదామ్మా.. అందుకే నిద్రపోకుండా చదువుకుంటున్నాను అని పక్కనే ఉన్న ఒక పుస్తకాన్ని చూపిస్తాడు. ఇక కొడుకు చదువుకుంటున్నాడు అని జ్ఞానాంబ ఎంతో సంతోషపడుతుంది. అంతేకాకుండా నీకు కాఫీ పెట్టిస్తాను ఉండు అని చెబుతుంది. ఇక ఆ తర్వాత జానకి నిద్ర లేచి చూశాక ఫోన్ ఎవరు తీసినట్లు అనుమానం వస్తుంది. మరి అఖిల్ డిలీట్ చేసిన విషయాన్ని కనుగొంటుందా లేదా అనేది తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.