Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
EMKకి బై చెప్పేసిన ఎన్టీఆర్.. అన్ని వేళ్ళు ఎన్టీఆర్ వైపే ఉండడంతో...కొత్త అనుమానాలు.?
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో జెమిని టీవీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన కౌన్ బనేగా కరోడ్పతి అనే ప్రోగ్రాంకి పలు మార్పులు చేర్పులు చేసి కొత్త వర్షన్ గా రూపొందిన ఈ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ షో కర్టెన్ రైజర్ కి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా రాజమౌళి, కొరటాల శివ, సమంతలు కూడా హాజరై ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు ఈ షో మొదటి సీజన్ షూట్ పూర్తయిందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
వెకేషన్ మోడ్ కి
ఎన్టీఆర్ హౌస్ గా జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షో మొదటి సీజన్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. సోమవారం నాడు సీజన్ వన్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా ఎన్టీఆర్ ఇప్పుడు వెకేషన్ మోడ్ లోకి వెళ్లి పోతున్నారు. ఇప్పటికే రాజమౌళి సినిమా షూటింగ్ కూడా పూర్తయిన నేపథ్యంలో ఆయన తన ఫ్యామిలీతో కలిసి కొంత క్వాలిటీ టైం గడుపుతున్నారని ఆ తర్వాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతారు అని అంటున్నారు..
అన్ని వేళ్ళు ఎన్టీఆర్ వైపే
ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు ఎన్టీఆర్ రెండో సీజన్ కి వస్తారా రారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ఎందుకంటే మొదటి సీజన్ కోసం ఎన్టీఆర్ కు భారీగా రెమ్యూనరేషన్ సమర్పించారు ఈ షో నిర్వాహకులు. ఎన్టీఆర్ షో పోస్ట్ చేస్తూ ఉండడం తో భారీ ఎత్తున టిఆర్పి రేటింగులు వస్తాయని భావించారు.. కానీ అనేక కారణాలతో ఈ షోకి ఊహించిన మేర టిఆర్పి రేటింగులు అయితే దక్కలేదు.. ఈ నేపథ్యంలో అన్ని వేళ్ళు ఎన్టీఆర్ వైపే చూపించడం ఖాయం.
కొత్త అనుమానాలు
నిజానికి మామూలు గానే జెమినీ టీవీ కి వీక్షకులు చాలా తక్కువ. అదీకాక బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో అంటే చూస్తారు, కానీ ఇలా ప్రశ్నలడిగి వాటికి సమాధానాలు చెప్పే షోలను ప్రేక్షకులు ఎంకరేజ్ చేయకపోవచ్చు అనే విషయం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నిర్వహించిన ఈ షో ద్వారా వెల్లడైంది.. దీంతో వచ్చే ఏడాది జరగబోతున్న రెండో సీజన్కు ఎన్టీఆర్ హాజరు కావడం మీద నీలినీడలు కమ్ముకున్నాయి..నిజానికి ఎన్టీఆర్ హోస్ట్ చేయడంతో జెమినీ టీవీ టిఆర్పి రేటింగులు పెరిగాయి కానీ ఊహించిన మేర అందుకోలేదని అంటున్నారు.
Recommended Video
సెలబ్రిటీ గెస్ట్
అందుకే మీలో ఎవరు కోటీశ్వరులు నిర్వాహకులు ప్రతివారం ఎవరో ఒక సెలబ్రిటీ గెస్ట్ ఉండేలా ప్లాన్ చేశారు. ముందు రామ్ చరణ్, మూడో వారంలో రాజమౌళి, కొరటాల శివ ఇద్దరు హాజరై ఎన్టీఆర్ తో పాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇప్పటికే ఈ షోకి మహేష్ బాబు హాజరయ్యారు అనే ప్రచారం జరుగుతుండగా షూటింగ్ కూడా పూర్తయిందని మహేష్ బాబు ఏకంగా పాతిక లక్షలు గెలుచుకున్నారు అని అంటున్నారు. ఈ ఎపిసోడ్ దీపావళికి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. సమంత ఎపిసోడ్ ను కూడా దసరా సందర్భంగా విడుదల చేశారు.