Don't Miss!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
జోగుళాంబ ఆలయంలో ‘కలవారి కోడలు’ షూటింగ్
ఎంటర్టైన్మెంట్ రంగంలో అందులోనూ బుల్లితెరలో నటిగా కెరీర్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి నిర్మాత స్థాయికి చేరిన నటి హర్షారాణి. స్క్రీన్ పేరు నవీన. తొలిసారిగా 'అలౌకిక' సీరియల్తో ప్రారంభమైన ఆమె కెరీర్ 'చంద్రముఖి' 'సృష్టి' 'కలవారి కోడళ్లు' సీరియల్స్తో బిజీగా ఉంది. మంచి రేటింగ్తో సాగుతున్న 'చంద్రముఖి'లో మేనకగా తన పాత్ర ఎంతో పేరు తెచ్చిపెట్టిందని చెబుతోంది. 'కలవారి కోడలు'ను యాటాస్ మూవీ ఫెస్టివల్స్ బేనర్పై హర్షారాణి నిర్మాతగా మారటం వెనుక ఆమె భర్త యాటా సత్యనారాయణ ప్రోత్సాహం ఉందని అంటోంది. జీ తెలుగులో 'కలవారి కోడళ్లు' సీరియల్ 650 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని విజయపథంలో నడుస్తోంది. జీటీవీలో సాయంత్రం 6.30 గంటలకు ప్రసారమవుతున్న ఈ సీరియల్తోపాటు తమ బేనర్లో గేమ్స్ షోలు కూడా ఏర్పాటు చేయాలను కుంటున్నట్టు చెబుతోంది.
బుల్లితెర అంటేనే డైలీ సీరియల్స్. డైలీ సీరియల్స్ అంటేనే మహిళా ప్రేక్షకులు. అందుకే మహిళా ప్రేక్షకుల కోరిక మేరకు ముచ్చటగా రెండు డైలీ సీరియల్స్ 'వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి', 'కలవారి కోడళ్లు' 'చిన్న కోడలు' వారానికి 6 రోజులు అంటే సోమవారం నుండి శనివారం వరకు ప్రసారం చేస్తున్నారు. ఇది జీ తెలుగు ప్రేక్షకులకు, మరీ ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకి మరింత ఆనందాన్ని కలిగిస్తుందని, వారి ఆదరాభిమానాలు యిలాగే కొనసాగేలా సీరియల్స్ని రూపొందిస్తున్నామని జీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ జి. తెలిపారు.