Don't Miss!
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
Kangana Ranaut లాకప్ రియాలిటి షో రచ్చ.. పెదవి విప్పిన కంగన..
తన సినిమాలతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది బాలీవుడ్ బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్. బాలీవుడ్ మాఫియా అని, నెపోటిజం అని ఇటీవలి కాలంలో కంగన తరచుగా ఏదో ఒక వివాదాస్పద అంశం గురించి మాట్లాడి మరింత వివాదాన్ని రేకెత్తిస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కంగన ప్రస్తుతం లాకప్ అనే రియాలిటీ షోకు హోస్ట్గా వ్యవహరిస్తోంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ఈ కార్యక్రమాన్ని నిర్మిస్తోంది. ఈ కార్యక్రమం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగన మాట్లాడింది.
ఏక్తా కపూర్ గ్రేట్
బాలీవుడ్లో చాలా మంది వారసులు ఉన్నారని, వారందరూ తన తల్లిదండ్రుల పేర్లు చెప్పుకుని పైకి ఎదుగుతారని, అలాంటి వారిలో ఏక్తా లేదని తాను నమ్ముతున్నానని కంగన చెప్పింది. `జితేంద్ర కీర్తికి, అతని ఆస్తులకు ఏక్తా వారసురాలు. కావాలనుకుంటే ఆమె తన తండ్రి పేరును వాడుకొవచ్చు. కానీ ఆమె అలా చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. ఆమె స్వయంకృషితో ఎదిగింది. నాలాంటి వారు ఎందరినో ప్రోత్సహించింది. అందుకే ఆమె అంటే నాకెంతో అభిమానం. ఆ కారణం వల్లే ఈ షోకి హోస్ట్గా వ్యవహరిస్తున్నా` అని కంగన చెప్పింది.
నా వ్యక్తిత్వం గురించి తెలిసింది
`నేను స్క్రీన్ మీద ఎంతో మంది బలమైన మహిళల పాత్రలను పోషించా. అయితే నిజ జీవితంలో నేను ఎంత స్ట్రాంగ్గా ఉంటానో నాకు తెలియదు. నా వ్యక్తిత్వం ఎలాంటిదో నాకు పూర్తిగా తెలియదు అనిపించింది. అదే విషయం గురించి ఏక్తా నన్ను అడిగింది. ``లాకప్` కార్యక్రమం ద్వారా నువ్వు ఎంత బలమైన మహిళవో నీకు తెలుస్తుంది. నీ వ్యక్తిత్వం మీద అవగాహన వస్తుంది. అందుకే ఈ ప్రాజెక్టు చెయ్యి అని అడిగింద`ని కంగన చెప్పింది. నిజంగా ఆ కార్యక్రమం ద్వారా తనకు తాను కొత్తగా కనిపించానని కంగన చెప్పుకొచ్చింది.
వ్యతిరేకించిన వారితోనే షో
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూకీ గతంలో కంగనను సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విమర్శించాడు. `కంగన నెపోటిజమ్ను వ్యతిరేకిస్తుంది. కానీ, తను మాత్రం చెల్లెలినే మేనేజర్గా పెట్టుకుంటుంది` అంటూ కంగన గురించి గత రెండేళ్లుగా మునావర్ విమర్శలు చేశాడు. తాజాగా కంగన హోస్ట్గా వ్యవహరిస్తున్న `లాకప్`లో మునావర్ కూడా ఓ కంటెస్టెంట్గా బరిలోకి దిగాడు. వీరిద్దరి మధ్య సంభాషణలపై నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.
వరుస సినిమాలతో బిజీ
కంగన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. కంగన చేతిలో ప్రస్తుతం `తేజాస్`, `ధాకడ్`, `మణికర్ణిక: రిటర్న్స్`, `ఎమర్జెన్సీ`, `సీతా` సినిమాలు ఉన్నాయి. నటిగానే కాదు.. నిర్మాత కూడా కంగన అదృష్టం పరీక్షించుకోబోతోంది. `టీకూ వెడ్స్ షేరు` అనే సినిమాను నిర్మిస్తోంది. హిందీలోనే కాదు పలు దక్షిణాది భాషల నుంచి కూడా కంగనకు అవకాశాలు వస్తున్నాయి.
జైశ్రీరామ్ అంటూ నినాదాలు
గత కొంతకాలంగా కంగన బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రముఖులపై, రాజకీయ నాయకులపై కంగన ట్విటర్ వేదికగా విరుచుకుపడుతుంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. పంజాబ్లో తప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. దీంతో కంగన `జైశ్రీరామ్` అంటూ బీజేపీకి అభినందనలు తెలిపింది.