Don't Miss!
- Sports SRH vs MI: ఆ దిగ్గజ క్రికెటర్ వల్లనే చరిత్ర సృష్టించా- అభిషేక్ శర్మ
- News విజయవాడ పశ్చిమ సీటులో మారిపోయిన లెక్కలు !
- Automobiles ఫ్రీ బస్సులో వాటికి ప్రత్యేకంగా సీటు.. బామ్మ, మనవరాలికి షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Lifestyle Car Vastu Tips: కారు ఉందా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి..ఈ డైరెక్షన్ లో పార్క్ చేస్తే
- Technology Poco నుంచి F సిరీస్ లో కొత్త ఫోన్! స్పెసిఫికేషన్లు లీక్, వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
ఫుల్ గా తాగి,మత్తులో టీవి నటిపై లైంగిక దాడి, పోలీస్ కంప్లైంట్
బెంగళూరులోని ఓ బార్లో జరిగిన గొడవలో ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు ఒకరు బుల్లితెర నటిపై దాడికి యత్నించిన సంఘటన హాట్ టాపిక్ గా మారింది.
బెంగళూరు: తాగిన మైకంలో చేసే చిల్లర పనులు ఒక్కోసారి పెద్ద ఇబ్బందులనే కొని తెచ్చిపెడుతూంటాయి.తాజాగా బెంగళూరులోని ఓ బార్లో జరిగిన గొడవలో ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు ఒకరు టీవి నటిపై దాడికి యత్నించాడు. దాడి ఘటనపై నటి స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు యూబీ సిటీ 17వ అంతస్ధులోని స్రైబార్లో ఆదివారం రాత్రి ఫుల్ గా తాగిన కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు తీవ్రంగా గొడవపడి తిట్టడంతో పరస్పరం కొట్టుకున్నారు.
వాళ్లు మొత్తం ఏడుగురు. వాళ్ళలో ..బుల్లితెర నటి నిరూషా కూడా ఉంది. ఓ దశలో పీకలదాకా తాగిన పారిశ్రామికవేత్త కుమారుడు దర్శన్ ...నిరూషాపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో స్నేహితులతో కలిసి కబ్బన్పార్క్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన నిరూషా ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే మత్తు దిగిన దర్శన్ చేసిన తప్పుకు క్షమించాలని కోరుతూ నిరూషాకు లేఖ రాయడంతో కథ అక్కడితో ముగిసింది. నిరూషా కూడా దర్శన్పై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకునేందుకు అంగీకరించింది. అడపాదడపా స్కైబార్లో ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు.