Don't Miss!
- News కేసీఆర్కు ఎన్నికల సంఘం నోటీసులు
- Sports KKR vs RR: ఈ ఓటమి బాధ వర్ణాతీతం.. మాటలు రావడం లేదు: శ్రేయస్ అయ్యర్
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
Karthika Deepam లాగి కొడితే పళ్ల రాలుతాయ్ జాగ్రత్త.. వీడియో క్లిప్పు చూపించి మోనితకు సౌందర్య ఝలక్
కార్తీకదీపం సీరియల్లో నిరాటకంగా, సుదీర్ఘంగా ముందుకెళ్తున్నది. గత మూడేళ్లుగా సాగుతున్న ఈ సీరియల్లో పలు రకాల ట్విస్టులు చోటుచేసుకొన్నాయి. మోనిత, సౌందర్య మధ్య మాటల యుద్ధం, అలాగే కార్తీక్, దీప మధ్య ఎమోషనల్ విషయాలు ఆసక్తికరమైన అంశాలుగా కనిపించాయి. తాజాగా డిసెంబర్ 27వ తేదీన ప్రసారమైన 1233 ఎపిసోడ్లో ఏం జరిగిందంటే...
డాక్టర్ భారతీ ఫోన్ చేసి..
కార్తీక్ తల్లి సౌందర్యకు డాక్టర్ భారతీ ఫోన్ చేసి షాకింగ్ న్యూస్ చెప్పింది. మీ ఇంట్లో జరిగిన విషయాలు తెలిసి బాధ వేసింది. ఫోన్ చేసి వాటిని గుర్తు చేయడం ఇష్టం లేక మాట్లాడలేదు. అయితే మోనిత ఊరు విడిచి వెళ్లిపోయింది అని భారతి చెప్పింది. అయితే ఏంటి భారతీ.. మోనిత మా ఇంట్లోనే ఉంటుంది అని సౌందర్య చెబితే.. లేదు.. క్లినిక్ అమ్మేసి.. ఊరు విడిచి వెళ్లిపోయింది అని చెప్పింది. అయితే డాక్టర్ భారతి చెప్పడంతో ఇంటిలో మోనిత ఉందా అని శ్రావణిని అడిగితే.. ఉదయమే ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పడంతో సౌందర్య కంగారు పడిపోయింది. కార్తీక్, దీప ఎక్కడ ఉన్నారో తెలిసిందా? అనే ఆలోచనల్లో పడింది.
కార్తీక్, దీప ఎమోషనల్గా
ఇక దీపతో కార్తీక్ బాబు ఏదో మాట్లాడబోయి ఆగిపోయాడు. అయితే రుద్రాణి వచ్చిందనే విషయంతో కంగారు పడుతున్నారా అని అడిగితే.. కాదు.. కానీ ఆమె తీరు ఏమిటో అర్ధం కావడం లేదు. ఇంటికి వచ్చి స్వీట్లు, ఫ్రూట్స్ అని ఏదోలా ప్రవర్తిస్తున్నది. అసలు తన ఆలోచనలు ఏమిటో అంతుపట్టడం లేదు అని కార్తీక్ ఏదో సందేహం వ్యక్తం చేస్తే.. అలాంటి ఆలోచనలు పెట్టుకోకు.. మనం కూరగాయలు కోస్తుంటే కొన్ని పుచ్చులు వస్తాయి. వాటిని మనం పడేస్తాం.
అలాంటి పుచ్చుల మాదిరిదే రుద్రాణి. కార్తీక్ మీరు ప్రశాంతంగా ఉండటే కావాలని దీప సూచించింది. అయితే తనకు ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేదు. కాబట్టి ఏదో పని చేయాలని అనుకొంటున్నాను అని.. నీ పిండి వంటలను మార్కెట్ చేస్తాను అని కార్తీక్ అంటే.. దీప అందుకు ఒప్పుకోలేదు. మీరు అలాంటి పనులు చేయవద్దు బాగుండదు. కాకపోతే ప్రజా వైద్యశాల పెట్టండి అంటూ కార్తీక్కు దీప సూచించింది.
దీప బస్తీలో మోనిత హాస్పిటల్
సౌందర్య ఇంటి నుంచి బయటకు వచ్చేసిన మోనిత మరో ట్విస్టు ఇచ్చింది. గతంలో దీప ఉండే బస్తీలోని ఇంటిలో వంటలక్క ప్రజా వైద్యశాల అనే బోర్డుతో హాస్పిటల్ను తెరిచింది. బోర్డుపై డాక్టర్ మోనిత కార్తీక్ అంటూ రాయించుకొన్నది అయితే మోనిత చేష్టలను బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ కొట్టడానికి వెళితే.. బస్తీవాస్ సముదాయిస్తూ.. ఇప్పుడు ఆ ఇంటిని మోనిత కొనుగోలు చేసింది. మనం ఏం చేయలేం అంటూ చెప్పడంతో వెనుకకు తగ్గాడు. అయితే బస్తీవాసులు మాత్రం మోనితపై ఘాటుగా స్పందించారు. అయితే నాది జాలి గుండె, దీప, కార్తీక్ ఎక్కడికి వెళ్లారో తెలియదు. వారి ఆచూకి కోసం అందరం కలిసి వెతుకుదాం అని మోనిత చెప్పింది.
మోనితకు వార్నింగ్ ఇచ్చిన బస్తీవాసులు
బస్తీవాసులను కన్విన్స్ చేయడానికి మోనిత ప్రయత్నించింది. అయితే బస్తీవాసులు ఐకమత్యం అంటూ చెయ్యెత్తి జై కొడితే. ఎవరూ స్పందించలేదు. అయితే వంటలక్క వైద్యశాల మీది.. నాది.. మన అందరిది. ప్రజా వైద్యశాలను ఉపయోగించుకోండి. నాలో దీపక్కను చూసుకోండి అని మోనిత అంటే.. దీపమ్మ ఎక్కడ.. నీవు ఎక్కడ.. మీ వద్ద వైద్య చేయించుకోం. దీపమ్మను కష్టాలపాలు చేసింది నీవే. మీ హాస్పిటల్కు రాలేం అంటూ అంటే... మీరు ఎలా రారో చూస్తా అని మోనిత అంటే.. మీరు ఇక్కడ ఎలా ఉంటారో మేము చూస్తాం అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది.
ప్రియమణికి చెక్.. కొత్ పనిమనిషిగా
వంటలక్క ప్రజా వైద్యశాలలో నర్సుగా చేరడానికి నర్సమ్మ అనే యువతి వచ్చింది. అయితే నీ పేరు ఏమిటంటే.. నర్సమ్మ అంటే.. వృత్తి తగిన పేరు.. పేరుకు తగిన వృత్తి అంటూ మోనిత కామెంట్ చేసింది. నా పనిమనిషి ప్రియమణి తాడికొండ తన సొంత గ్రామానికి వెళ్లింది. ఓవరాక్షన్ చేస్తే నేను ఆమెను ఇంటికి పంపించేశాను. నీవు కుడికాలి హస్పిటల్లో పెట్టి లోనికి రా అంటూ ఆహ్వానించింది. నీవు నర్సుగా, ఇంటిలో పనిమనిషిగా ఉండాలని చెప్పింది.
మోనితకు షాకిచ్చిన సౌందర్య
ఒక సౌందర్య ఇంటికి కానిస్టేబుల్ రత్నసీత వచ్చి మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. మోనిత బస్తీకి వెళ్లింది అని చెబితే.. ఆమెకు అక్కడ ఏం పని అని కంగారుగా అడిగారు. దాంతో ఆమె అక్కడే ఇల్లు కొనుక్కొని వంటలక్క ప్రజా వైద్యశాల అని స్పిటల్ పెట్టింది అని రత్నసీత చెప్పింది. అంతలోనే ఇంటిలోకి మోనిత వచ్చి మీ ఆశీస్సులు కావాలి? బస్తీలో వంటలక్క ప్రజావైద్యశాల పెట్టాను. ఆ సందర్భంగా స్వీట్లు పంచుతున్నాను.
మీ నోరు తీపి చేయాలనుకొంటున్నాను. మీరు తినండి అంటే.. సౌందర్య, ఆనందరావు, శ్రావ్య, ఆదిత్య నిరాకరించారు. దాంతో వాళ్లకు మూడ్ లేదు. నా మాటలు విని కడుపు నిండిపోయిందనుకొంటా. ఈ సమయంలో కార్తీక్ ఉంటే బాగుండని అంటే.. మోనిత.. నీవు ఇలానే మాట్లాడుతే.. లాగి పెట్టి కొడుతా.. నోట్లో గులా జామున్తోపాటు పళ్లు కూడా రాలి కిందపడుతాయి అంటే వార్నింగ్ ఇచ్చింది.
వీడియో చూపించిన సౌందర్య
ఇక తన కుమారుడు ఆనందరావును ఆదిత్య కిడ్నాప్ చేసి దాచిపెట్టారని ఆరోపణలు చేస్తున్న మోనితకు సౌందర్య గట్టి షాకిచ్చారు. నీ కొడుకును మేము దాచిపెట్టామా? అని అంటే.. ఎందుకమ్మా.. ఈ మాటలు... మెడపట్టి గెంటు బయటకు అని గట్టిగా ఆదిత్య అరిచాడు. అయితే మేము కాదు.. నీవు చేసిన పని కారణంగానే నీ కొడుకును ఎవరో ఎత్తుకెళ్లాడు. ఈ వీడియో చూడు అంటూ శ్రీవల్లి భర్త పిల్లాడిని ఎత్తుకెళ్లే సీన్ను మోనితకు సౌందర్య చూపించింది.