Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నా కోడల్ని బతికించు.. ఇద్దరు పిల్లల్ని తల్లికి దూరం చేయకు.. సౌందర్య కన్నీరుమున్నీరు
కార్తీక దీపం సీరియల్లో దీప అనారోగ్యం అందరిలోనూ ఓ రకమైన భయాన్ని కలుగజేస్తున్నది. చావు బతుకులతో పోరాటం చేసే దీప పరిస్థితిని తన తల్లికి సౌందర్యకు వెల్లడించిన తర్వాత వారిద్దరిలోనూ భావోద్వేగం కనిపిస్తున్నది. తల్లి, కోడుకుల మధ్య ఎమోషనల్ బంధం మరింత పెరిగి ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. సోమవారం నాటి 1029 ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Recommended Video
సానియా ఇయప్పన్.. బీచ్ అందాలతో బికినీ బ్యూటీ
దేవుడిపై భారం వేసిన అత్త
కోడలు దీప ఆరోగ్యం క్షీణించడంపై అత్త సౌందర్యలో ఆందోళన రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఇక దేవుడిపై భారం వేసిన సౌందర్య.. భగవంతుడిని ముందు దీపం వెలిగించింది. తన కోడలు కాపాడే బాధ్యత నీదే అంటూ రెండు చేతులు ఎత్తి ప్రాధేయపడింది. నీ ముందు దీపాన్ని వెలిగించాను. మనిషిలోని దీపాన్ని వెలిగించే బాధ్యత నీదే అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అరచేతులు అడ్డుపెట్టినా...
నా ఇంటి దీపం నా కోడలు దీప. ఆ దీపం ఇప్పుడు రెపరెపలాడుతున్నది. అరచేతులు అడ్డుపెట్టినా లాభం లేదనే భయం వెంటాడుతున్నది. దీప కార్తీక దీపంలా వెలగాలి. దీప మాములు మనిషిలా మారాలి. ఇంట్లో డాక్టర్ ఉన్నాడు. చేతినిండా డబ్బు ఉంది. ఖరీదైన వైద్య చేయించడానికి స్థోమత ఉంది అంటూ దేవుడి పటాల ముందు సౌందర్య కన్నీరుమున్నీరయ్యారు.
కంటతడి పెట్టిన అత్త సౌందర్య
దీప ఆరోగ్యానికి కావాల్సింది నీ కృప. అన్నింటికంటే అతీతమైనది నీ ఆశీర్వాదం. నా కోడలు జీవితానికి అది కావాలి. నా కోడల్ని బతికించు. నా మనవరాళ్లకు తల్లిని దూరం చేయకు అంటూ సౌందర్య కంటతడి పెట్టింది. ఇలా దీప ఆరోగ్యం కుదటపడాలని కార్తీక్, సౌందర్య రకరకాలు ప్రయత్నిస్తూ ఆవేదన చెందుతున్నారు.
చెప్పినా వినని వంటలక్క
అయితే కార్తీక్, మోనిత వ్యవహారంపై అసహనంతో దీప తన పంతాన్ని నెగ్గించుకోవడానికి వంటగదిలోకి దూరింది. ఎందుకు వంటగదిలోకి వచ్చారని అడిగితే.. డాడీ వద్దని చెప్పితే ఊరుకొంటానా? అని దీప అంటే... నీవు వంట చేస్తే డాడీ ఎందుకు కోపగించుకొంటాడని కూతురు అడిగితే.. పడుతున్నాను కదా.. ఎవరైనా పడుతుంటే.. ఎవరైనా, ఎవరినైనా అంటూనే ఉంటారు అని దీప సమాధానం ఇచ్చింది.
భావోద్వేగంలో కార్తీక, సౌందర్య
వంట చేస్తే దీప ఆరోగ్యం క్షీణిస్తుందని డాక్టర్లు చెప్పడంతో కార్తీక్కు తన భార్య ఆరోగ్యంపై చింత పెరిగిపోతున్నది. అలాగే కోడలు అనారోగ్యం గురించి తెలిసినప్పటి నుంచి సౌందర్యలో కూడా అదే ఆందోళన పెరిగిపోతున్నది. కానీ దీప పంతం పెరిగిపోవడం వారిద్దరికి మరింత బాధ కలుగుతున్నది.