టీవీ రియాల్టీ షో : రూ. కోటి గెలుచుకున్న పోర్టరు భార్య

దీంతో కష్టాల కడలిలో ఈదుతున్న సనూజ ఊహించని రీతిలో అందులో నుంచి బయట పడ్డట్లయింది. కేరళకు చెందిన సనూజ ప్రేమించిన వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. దీంతో వీరిని ఇరు కుటుంబాల వారు దూరంగా పెట్టారు. అయితే ఆమె భర్త ఆమెను చదువకోమని ప్రోత్సహించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించేలా ప్రిపేర్ చేయించాడు.
ఏడాది క్రితం ఆమెకు తిరువనంతపురంలోని కలెక్టర్ ఆఫీసులో అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది. అయినా వారి కష్టాలు తీరలేదు. ఇద్దరు పిల్లలు, వారి చదువులకు తోడు ఇటీవల అంతా అనారోగ్యం కారణంగా అప్పుల పాలై ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెను రియాల్టీ షోలో పాల్గొని విజేతగా నిలిచింది. ఈ షోలో కోటి రూపాయలు గెలిచిన తొలి వ్యక్తి కూడా ఆమెనే. కోటి గెలుచుకున్న సనూజా రాజన్ తన కష్టాలు తీరిపోవడం ఆనందం వ్యక్తం చేసింది. తన భర్తచే పోర్టరు పని మాన్పించి టాక్సీ కారు కొనిస్తానని అంటోంది.


Click it and Unblock the Notifications











