Don't Miss!
- Sports సన్రైజర్స్ కేప్టెన్ పాట్ కమ్మిన్స్కు గుడ్ న్యూస్
- Technology 32MP టెలిఫోటో కెమెరా, 8GB ర్యామ్ Oppo స్మార్ట్ఫోన్పై డిస్కౌంట్.. రూ.2999 తగ్గింపు సహా..!!
- Finance Banking News: ముసలోళ్లనూ వదలని మోదీ సర్కార్..! SBI తాజా రిపోర్ట్ వివరాలివే..
- News AP Election Survey: వైసీపీ వర్సెస్ కూటమి పోరులో మొగ్గు వారికే -తేల్చేసిన మరో జాతీయ సర్వే..!
- Automobiles చీరకట్టులో బైక్ రైడ్ చేసిన ప్రముఖ నటి.. మండిపడుతున్న నెటిజన్లు - ఎందుకంటే?
- Lifestyle ఫెయిర్నెస్ క్రీమ్ లు కిడ్నీ సమస్యలను పెంచుతున్నాయి జాగ్రత్త..!
- Travel శ్రీరామనవమి రోజున అయోధ్య రామాలయంలో అద్భుత ఘట్టం...
'కొత్త జంట' టీవి ఛానెల్ లో...డేటిచ్చేసారు
హైదరాబాద్: గతంలో సినిమా రిలీజైన చాలా కాలానికి గానీ టీవిలో వచ్చేది కాదు. ఇప్పుడు పరిస్ధితులు మారాయి. థియోటర్ లో పెద్దగా ఆడని సినిమాలను ముందే టీవి ఛానెల్ కు వేసేస్తున్నారు. అల్లు శిరీష్ తాజా చిత్రం 'కొత్త జంట' ఆ మధ్య రిలీజై నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఇప్పుడు టీవిలో ప్రీమియర్ షో పేరట వేయటానికి సిద్దం చేస్తున్నారు. జూలై 20 వ తేదీ సాయింత్రం ఆరు గంటలకు జీ తెలుగు ఛానెల్ లో ఈ చిత్రాన్ని ప్రసారం చేస్తున్నారు. మంచి టీఆర్పీ లు వస్తాయని భావిస్తున్నారు.
చిత్రం కథేమిటంటే... టీవీ ఛానెల్ లో పనిచేసే శిరీష్(అల్లు శిరీష్) ,సువర్ణ(రెజీనా) ఇద్దరూ బాగా స్వార్ధపరులు...కానీ టాలెంటెడ్. వీళ్ళిద్దరూ టీఆర్పీలు లేక మూలన పడిన ఓ తెలుగు ఛానెల్ ని నిలబెట్టి నెంబర్ వన్ చేయటానికి కలిసి పనిచేయాల్సి వస్తుంది. అందులో భాగంగా కొత్త జంట అనే పోగ్రాం డిసి ఒకటి చేస్తారు. ఆ పోగ్రాం లక్ష్యం... కుల,మత,వర్ణ,వర్గ,పేదా,ధనిక తారతమ్యం తో పెళ్లిళ్లలకు ఇబ్బందులు ఎదరువుతున్న జంటలకు తమ ఛానెల్ లో లైవ్ పోగ్రాం తో పెళ్లిళ్లు చేయటం. అలా పెళ్ల్ళిళ్లు చేస్తే గొడవలు జరిగి, తమకు టీఆర్పీలు వస్తాయని ప్లాన్. అనుకున్నట్లుగానే ఆ పోగ్రాం సక్సెస్ అవుతుంది. అయితే ఊహించని విధంగా శత్రువులను తెచ్చి పెడుతుంది. మరో ప్రక్క బిజినెస్ మ్యాన్(పోసాని)కి సువర్ణ అంటే ఇష్టం.
ఆమెతో గడపాలనుకునే అతను కొత్త ఛానెల్ లాంచ్ చేస్తానని శిరీష్ ని పిలిచి మంచి జీతంతో కెరీర్ ఆఫర్ ఇస్తాడు. అయితే సువర్ణని తీసుకురావాలని కండీషన్ పెడతాడు. అయితే పోసాని ఇంటెన్షన్ అర్దం చేసుకున్న సువర్ణ ...ఆ ప్రపొజల్ కు నో చెప్తుంది. కానీ అప్పటికే పోసాని ఇచ్చే డబ్బుతో ప్రేమలో ఉన్న శిరీష్....ఆమెను ఎలాగైనా ఒప్పించటానికి ఆమెని ప్రేమిస్తున్నానని నాటకం ఆడతాడు. అది నిజమని నమ్మిన శిరీష ...అతనితో ప్రేమలో నిజంగానే పడుతుంది. అప్పుడు ఏమైంది... నిజం ఆమె ఎప్పుడు తెలుసుకుంటుంది...చివరకు వాళ్ళిద్దరూ ఎలా ఒకటయ్యారు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
రెజీనా ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... 'కొత్త జంట' ఇప్పటికే రెండుసార్లు చూశా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏ హీరోయిన్ కైనా విజయం అత్యవసరం. అది ఈ సినిమాతో దక్కిందని భావిస్తున్నా. శిరీష్ సెట్లో చాలా హుషారుగా కనిపించాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నాకు తెలుగు నేర్పించిన తొలి గురువు.. మా దర్శకుడు మారుతి. ఏ సన్నివేశానికైనా రెండు మూడు పేజీల డైలాగులు నా చేతిలో పెట్టేవారు. పరీక్షలకు వెళ్లే విద్యార్థినిలా అవి చదువుతూ కూర్చునేదాన్ని. అలా తెలుగు వచ్చేసింది అంటోంది.