Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
డ్యామేజ్ కంట్రోల్: 'సర్దార్' నిర్మాతతో మాటీవి డిస్కౌంట్ కోసం బేరం
హైదరాబాద్ : సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం ఊహించని విధంగా భారీ నష్టాలు మిగిల్చే దిశగా భాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్రం డిస్ట్రిబ్యూటర్స్ కు మాత్రమే కాక మాటీవి కు సైతం ఈ కలెక్షన్స్ నిద్రపట్టనీయకుండా చేస్తున్నాయి.
మధ్యలో మాటవీకి ఏమిట షాక్ అంటే... ఈచిత్రం శాటిలైట్ రైట్స్ ని మిగతా టీవి ఛానెల్స్ జెమినీ, జీ తెలుగులతో పోటీ పడి మరీ దక్కించుకుంది. ఈ రైట్స్ కోసం పన్నెండున్నర కోట్లు చెల్లించారు. బాహుబలి తర్వాత ఎక్కవ రేటు పెట్టింది ఈ చిత్రానికే. దాంతో ఇప్పుుడ మాటీవి యాజమాన్యం డ్యామేజ్ కంట్రోలుకు పూనుకున్నట్లు సమాచారం.
డ్యామేజ్ కంట్లోల్లో భాగంగా..మాటీవి యాజమాన్యం... సర్దార్ నిర్మాత శరద్ మరార్ ని కలిసారని చెప్తున్నారు. ఈ శాటి లైట్ రైట్స్ కోసం అడ్వాన్స్ చెల్లించి ఎగ్రిమెంట్ చేసుకున్న మాటీవి...సినిమా ఫలితం దారుణంగా ఉంది కాబట్టి...ఎగ్రిమెంట్ కాన్సిల్ చేసి, రేటు తగ్గించమని అడుగుతున్నట్లు ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు.
అయితే శరద్ మరార్ మాత్రం అలాంటిది అడగవద్దని, తాము తర్వాత పవన్ తో చేయబోయే చిత్రంలో దాన్ని ఎడ్జెస్ట్ చేస్తామని హామీ ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. మాటీవి వారు మాత్రం రేటు తగ్గించవల్సిందే అని పట్టుబడుతున్నట్లు వినపడుతోంది. ఇక గతంలో శరద్ మరార్..మాటివికు సీఈవో గా పనిచేసిన సంగతి తెలిసిందే.