Don't Miss!
- News అయ్యయ్యో.. అపర చాణిక్యుడు కేసీఆర్ అస్తిత్వ పోరాటం!!
- Sports రోహిత్ శర్మ ప్లేస్లో..!!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సినీ గేయరచయిత చంద్రబోస్కు కాళోజీ స్మారక పురస్కారం
హైదరాబాద్: తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, భారత్ కల్చరల్ అకాడెమీ సంయుక్తంగా ప్రతి సంవత్సరం అందించే మహాకవి కాళోజీ స్మారక పురస్కారం 2016 సంవత్సరానికిగాను ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ను ఎంపిక చేసినట్లు తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, భారత్ కల్చరల్ అకాడెమీ వ్యవస్థాపకులు దర్శక నిర్మాత నాగబాల సురేష్ తెలిపారు.
గత సంవత్సరం ఈ అవార్డును సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజాకు అందించినట్లు చెప్పారు. ఈ నెల 14న రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, పరచూరి గోపాలకృష్ణతో పాటు పలువురు అధికారులు, కవులు, సాహితీవేత్తలు పాల్గొంటారని సురేష్ వెల్లడించారు.
ఈ పురస్కారం క్రింద ప్రశంసాపత్రము, జ్ఞాపిక, శాలువాతో పాటు రూ. 10,116 నగదు అందిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం ఈ అవార్డును సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారికి అందించామని, 2014లో జె.కె.భారవి ఈ అవార్డు అందుకున్నారని సురేష్ వెల్లడించారు.