Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నాగార్జున....బ్రేక్ కే బాద్ మళ్లీ
హైదరాబాద్ : నాగార్జున సూపర్ హిట్ టీవి షో...'మీలో ఎవరు కోటీశ్వరుడు'కి త్వరలో బ్రేక్ ఇవ్వబోతోంది. ఆగస్ట్ 7న ఈ షో చివరి ఎపిసోడ్(40) ప్రసారం అవుతుంది. తర్వాత కొంతకాలం బ్రేక్ తీసుకుని సీజన్ 2 తో మళ్లీ వస్తారు. ఈ సీజన్ సూపర్ హిట్ అయ్యిందని,తన మనస్సుకు బాగా నచ్చిన షో అని నాగార్జున అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ... 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ద్వారా ఆడియన్స్ తో నేరుగా కలిసే అవకాశం లభించింది. వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రతి క్షణం ఎంతగానో ఎంజాయ్ చేశాను. నా మనసుకు దగ్గరైన కార్యక్రమం ఇది అని అని చెప్పుకొచ్చారు. అలాగే....పోటీలలో పాల్గొన్న వారి హుందాతనం, అమాయకత్వం, అంకితభావం, వారి కుటుంబ నేపథ్యం తనను ఎంతో ఆకట్టుకున్నాయని నాగార్జున అన్నారు.
అత్యంత ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ఈ షో దిగ్విజయంగా 40 ఎపిసోడ్ లను పూర్తి చేసుకోవటంతో మాటీవి యాజమాన్యం సైతం చాలా సంతోషంగా ఉంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో కోటి రూపాయల ప్రైజ్ మనీతో ఓ గేమ్ షో ప్రసారం కానుండటం ఇదే ప్రథమం.
ఇంతకాలం సినిమాల ద్వారా వినోదం పంచుతూ వచ్చిన తాను మొదటిసారి టెలివిజన్ తెరపైకి వచ్చానని నాగార్జున అన్నారు. ఒక సామాజిక బాధ్యతతో ఈ గేమ్ షోకు ప్రయోక్తగా వ్యవహరించాననీ, అమితాబ్ ముద్రను అందుకోవడం చాలా కష్టమని తెలుసనీ, తన శక్తివంచన లేకుండా బాగా చేయడానికి కృషి చేసాననీ చెప్పారు. చాలా మంది సామాన్య పౌరుల కలల్ని నిజం చేయడం ద్వారా వారి జీవితాల్ని ఈ షో మార్చుతోందని ఆయన అన్నారు.