Don't Miss!
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
ద్రౌపది ఒంటిపై అలానా..? సంస్కృతిని మార్చడం కుదరదు.. ఏక్తా కపూర్పై ‘శక్తిమాన్’ సంచలన కామెంట్స్
బుల్లితెరపై సంచలనాలు నమోదు చేసిన ధారావాహికలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఓ ముప్పై యేళ్ల క్రితం దూరదర్శన్ ఛానెల్లో వచ్చిన రామాయణ, మహాభారతం, శక్తిమాన్ వంటి సీరియల్స్ ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. అవి చూపిన ప్రభావం అలాంటిది. కరోనా వచ్చి ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతోంటే.. ప్రజలంతా ఇంటి పట్టునే ఉండాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. దీంతో ఇంటికే పరిమితమైన వారి కోసం నాటి స్మృతులను గుర్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నాటి సీరియల్స్ను పున: ప్రసారం చేస్తోంది.
ప్రజల విజ్ఞప్తి మేరకు..
కరోనాను
కట్టిడి
చేసే
భాగంలో
దేశమంతా
లాక్
డౌన్
విధించిన
సంగతి
తెలిసిందే.
ఈ
మేరకు
ఏప్రిల్
14
వరకు
ప్రజలంతా
రోడ్లపైకి
రాకూడదు.
అందరికీ
వినోధాన్ని
పంచే
ఉద్దేశ్యంలో
ప్రజల
డిమాండ్
మేరకు
రామాయణ,
మహాభారత
గాథలను
పున:
ప్రసారం
చేసింది.
వీటితో
పాటు
90ల
కాలం
నాటి
పిల్లలకు
హీరో
అయిన
శక్తిమాన్
సీరియల్ను
కూడా
ప్రసారం
చేశారు.
రికార్డు స్థాయిలో టీఆర్పీ..
ప్రజలంతా ఇంటి పట్టునే ఉండటంతో ఈ సీరియల్స్ రికార్డు స్థాయిలో టీఆర్పీలు వచ్చాయని ప్రకటించారు. రామాయణ్ సీరియల్ను రెండు రోజుల్లో 8.5కోట్ల మంది వీక్షించారని లెక్కలు బయటకు వచ్చాయి. బుల్లితెరపై మళ్లీ అపురూప కావ్యాలుగా ఇవి రికార్డులు క్రియేట్ చేశాయి.
ఏక్తా కపూర్పై ఫైర్..
బుల్లి తెర క్వీన్, స్టార్ ప్రొడ్యూసర్ అయిన ఏక్తా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భాషలతో సంబంధం లేకుండా లెక్కకు మించిన సీరియల్స్ను నిర్మించి బుల్లితెరను శాసించింది. ఆమె తీసిన మోడ్రన్ భారతం కహానీ హమారే భారతం సీరియల్పై శక్తిమాన్ హీరో ముఖేష్ ఖన్నా నిప్పులు చెరిగాడు.
Recommended Video
సంస్కృతిని మార్చడం కుదరదు..
తాను నటించిన శక్తిమాన్ సీరియల్ను మోడ్రనైజ్ చేసి ప్రసారం చేస్తున్నారని, ఈ సీరియల్ ఏక్తా కపూర్ మోడ్రన్ మహాభారతంలా.. ద్రౌపది ఒంటిపై టాటూలు వేసుకున్నట్టు చూపించమని సెటైర్ వేశాడు. ఆమె భారతాన్ని చంపేసిందని, సంస్కృతిని మార్చే హక్కు ఎవ్వరికీ లేదని, అసలు మార్చడం కుదరదని, మార్చాలని ప్రయత్నించిన రోజే అది చచ్చిపోయినట్టని ఏక్తా కపూర్పై ఫైర్ అయ్యాడు.