Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిగ్ బాస్ కంటెస్టెంట్లకు మెగా పార్టీ.. అందరితో కలిసి రచ్చ చేసిన నాగబాబు
బిగ్ బాస్ షో నాల్గో సీజన్ కంటెస్టెంట్లపై నాగబాబు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. మొదటి నుంచి బిగ్ బాస్ షోను అంతగా ఫాలో అవ్వకపోయినా కూడా చివరికి మాత్రం ఫుల్ హల్చల్ చేశాడు. అవినాష్, అభిజిత్ అంటే ఇష్టమని ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా తనకు సంతోషమేనని నాగబాబు మాట్లాడిన మాటలు ఫుల్ వైరల్ అయ్యాయి. చివరకు నాగబాబు అనుకున్నట్టు కోరుకున్నట్టు అభిజిత్ విన్నర్గా నిలిచాడు.
స్పెషల్ మీటింగ్..
నాగబాబు తనకు మద్దతు ప్రకటించాడని తెలుసుకున్న అభిజిత్.. నాగబాబును ప్రత్యేకంగా కలిశాడు. నాగబాబు కూడా అభిజిత్ను కలుసుకోవాలని అనుకున్నాడట. కానీ డిస్టర్బ్ చేయడం ఎందుకని అనుకుంటూ ఉండగా అభిజిత్ కలవాలని అనుకున్నట్టు తెలియడంతో మీటింగ్ ఏర్పాటు చేశాడట. మొత్తానికి బిగ్ బాస్ విన్నర్గా నిలిచిన అభిజిత్ను సత్కరించి, కేక్ కట్ చేయించి పార్టీ ఇచ్చాడు నాగబాబు.
కంటెస్టెంట్లందరితో..
తాజాగా నాగబాబు బిగ్ బాస్ కంటెస్టెంట్లందరితో కలిసి రచ్చ చేసినట్టు కనిపిస్తోంది. అభిజిత్ తప్ప మిగతా అందరూ కూడా ఈ పార్టీలో హల్చల్ చేసినట్టు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా సోహెల్ అఖిల్ అవినాష్ మెహబూబ్ మాత్రం రచ్చ రచ్చ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలన్నీ కూడా తెగ వైరల్ అవుతున్నాయి.
గ్రాండ్ పార్టీ..
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లందరితో నాగబాబు చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ కలిసి కేక్ కట్ చేసి సందడి చేసినట్టు కనిపిస్తోంది. అరియానా, హారికలు తమ డ్రెస్సింగ్లతో అందరినీ బెదరగొట్టేశారు.
మెహబూబ్ ఎమోషనల్..
నాగబాబు సర్తో మాట్లాడిన ప్రతీ మాట, గడిపిన ప్రతీ క్షణం ఎంతో గొప్పగా ఉంది.. మాలో ఇలా స్ఫూర్తి నింపినందుకు ధన్యవాదాలు సర్.. మమ్మల్ని ఇలా ఆహ్వానించి అదిరిపోయే పార్టీ ఇచ్చినందుకు థ్యాంక్స్ సర్ అంటూ ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికి ఈ పార్టీలో మాత్రం కంటెస్టెంట్ల రీయూనియన్ అంటూ దుమ్ములేపినట్టు కనిపిస్తోంది.
బ్లడ్ బ్యాంక్లో అలా..
ఇక సోహెల్, మెహబూబ్ మాత్రం చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో రక్తం దానం చేసి మెగా ఫ్యాన్స్ను తమ బుట్టలో వేసుకున్నారు. బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ ఇవ్వడంలో ఉన్న సంతృప్తి మాటల్లో చెప్పలేమని అంటూ మెహబూబ్ ఎమోషనల్ అయ్యాడు.