Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సక్సెస్ఫుల్గా ముగిసిన నాగబాబు షో: ‘ఖుషీ ఖుషీగా’ ఫస్ట్ సీజన్ విన్నర్ ఎవరంటే!
టాలెంట్ ఉండి అవకాశాలు దొరకని వాళ్లకు అండగా నిలుస్తుంటారు మెగా బ్రదర్ నాగబాబు. ఇప్పటికే 'జబర్ధస్త్', 'అదిరింది' షోల ద్వారా పదుల సంఖ్యలో ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేశారాయన. ఇప్పుడు వాళ్లంతా బిగ్ సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు. ఇలా కాకుండా స్వతహాగా కొందరిలోని టాలెంట్ను గుర్తించి వాళ్లను వెలుగులోకి తీసుకు రావాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే సొంతంగా కొన్ని షోలను ప్రారంభించబోతున్నట్లు యూట్యూబ్ చానెల్ ద్వారా వెల్లడించారు. ఇందులో భాగంగానే 'ఖుషీ ఖుషీగా' అనే తొలి తెలుగు స్టాండప్ షోను మొదలెట్టారు.
కామెడీని పంచగలిగే సామర్థ్యం ఉన్న వాళ్లకు అవకాశం కల్పించడం కోసం నాగబాబు 'ఖుషీ ఖుషీగా' అనే స్టాండప్ కామెడీ షోను మొదలు పెట్టారు. దీన్ని కొందరు స్పాన్సర్ల సహాయంతో నడిపించారు. 12 ఎపిసోడ్ల పాటు జరిగిన ఈ షోను సొంత యూట్యూబ్ చానెల్లోనే ప్రసారం చేశారు. ఎంతో సందడిగా సాగిన ఈ కామెడీ షో నిన్నటితో ముగిసింది. నవ్వులు పంచుతూ సాగిన ఫినాలే ఎపిసోడ్లో శ్యామ హరిణి విజేతగా నిలిచినట్లు గెస్టుగా వచ్చిన నిహారిక వెల్లడించింది. అనంతరం ఆమెకు లక్ష రూపాయల ప్రైజ్మనీతో పాటు షీల్డ్ను అందజేశారు నాగబాబు.
'ఖుషీ ఖుషీగా' షో ద్వారా దాదాపు 30 మంది కమెడియన్లు తెలుగు వాళ్లకు పరిచయం అయ్యారు. వీరిలో పది మంది మాత్రమే తమదైన శైలి కామెడీని పంచుతూ షోలో పాల్గొన్నారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. అందులో శ్యామ హరిణి ఒకరు. ఆరంభం నుంచీ హాస్యాన్ని పంచిన ఈమె.. చివరకు విజేతగా నిలిచింది. ఇక, మొదటి సీజన్ అయిపోయిన తర్వాత నాగబాబు అందరికీ ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఈ షో సక్సెస్కు కారణం అయిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. అలాగే, త్వరలోనే రెండో సీజన్ మొదలవుతుందని వెల్లడించారు.