Don't Miss!
- News ఘర్ వాపసీ: రేవంత్ రెడ్డిని కలిసిన కేకే, కేసీఆర్ గౌరవం ఇచ్చారు కానీ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
ఆ వీడియోలు దారుణంగా ఉన్నాయి.. అందుకే చూపించలేదని నాగార్జున గారే చెప్పారు: రోహిణి కామెంట్స్
'బిగ్ బాస్' సీజన్ - 3 మొదటి వారం ఎలిమినేషన్ తర్వాత ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి ఎంటరైన విషయం తెలిసిందే. మొదటి రోజు ఇంటిలోకి అడుగు పెడుతూనే 'పిక్చర్ ఔర్ బాకీ హై దోస్త్' అని డైలాగ్ చెప్పిన ఆమె.. అదే రీతిలో వ్యవహారాలు నడిపింది. ఆ తర్వాత ఎందరితోనే గొడవలు పెట్టుకున్న తమన్నా.. రవి కృష్ణ విషయంలో చేసిన పనులకు హౌస్మేట్స్తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా అవాక్కయ్యారు. తాజాగా ఇదే విషయాలపై షో నుంచి ఎలిమినేట్ అయిన రోహిణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
ఇంట్లోకి వచ్చిన వెంటనే తమన్నా ఇలా చెప్పింది
వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించిన వెంటనే తమన్నా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘ఆమె ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత అందరం కూర్చుని మాట్లాడాం. అప్పుడు తన కష్ట సుఖాలను మా అందరితో పంచుకుంది. అదే సమయంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అప్పుడు మేమంతా ఆమెకు ధైర్యం చెప్పాం. దీంతో ఆమె కొంత కుదుట పడింది' అని రోహిణి చెప్పుకొచ్చింది.
నామినేట్ చేయొద్దని బ్రతిమాలింది
తమన్నా ఎంటరైన వారంలో ఆమెను ఎవరూ నామినేట్ చేయొద్దని బిగ్ బాస్ చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి వారం నామినేషన్ ప్రక్రియ మొదలయ్యే ముందు తమన్నా ఇంట్లోని అందరితో మాట్లాడిందని రోహిణి తెలిపింది. ‘తమన్నా ఇంట్లోని ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి నన్ను నామినేట్ చేయకండి అని బ్రతిమాలింది. నేను అందరికీ ఆదర్శంగా నిలవాలని అనుకుంటున్నాను. నాకు అవకాశం ఇవ్వండి అని కోరింది' అని రోహిణి వెల్లడించింది.
రవిని మాత్రం అలా చేస్తుందనుకోలేదు
తమన్నా ఇంటి నుంచి బయటకు రావడానికి కారణమైన రవి కృష్ణ వ్యవహారంపైనా రోహిణి స్పందించింది. ‘ఆ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో నాతో పాటు చాలా మంది తమన్నాకు వ్యతిరేకంగా ఓటు వేశాం. అయితే, అందరితో మంచిగానే ఉన్న ఆమె.. రవి కృష్ణ విషయంలో మాత్రం దారుణంగా ప్రవర్తించింది. అప్పటి వరకు పండు, పండు అని పిలిచిన తమన్నా.. అలా ప్రవర్తిస్తుందని అస్సలు ఊహించలేదు' అని రోహిణి పేర్కొంది.
బాత్రూమ్కు వెళ్లినా వదిలేది కాదు
రవి కృష్ణను తమన్నా టార్చర్ చేసిందని చెప్పిన రోహిణి.. ‘కేవలం నామినేట్ చేశాడనే కారణం చెప్పి అతడితో చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించింది. పప్పు పప్పు అంటూ ఏడిపించింది. పైగా రవి వాళ్ల అమ్మానాన్నకు మెసేజ్ కూడా ఇచ్చింది. అంతేకాదు, రవి బాత్రూమ్కు వెళ్లినా వెనకనే వెళ్లేది. దీంతో అతడు చాలా బాధ పడేవాడు. ఈ విషయంలో నన్ను కూడా ఎన్నో మాటలు అంది' అని ఆమె వివరించింది.
అందుకే చూపించలేదని నాగార్జున గారే చెప్పారు
తమన్నా ఎలిమినేట్ అయ్యే సమయంలో నాగార్జున చేసిన వ్యాఖ్యలను రోహిణి ప్రస్తావించింది. ‘‘మీరు హౌస్లో ఎంతో దారుణంగా ప్రవర్తించారు. అవి చూపించాలంటే మాకే ఇబ్బందిగా అనిపించింది. మీరు మాట్లాడిన చాలా వీడియోలను టెలీకాస్ట్ చేయలేదని నాగార్జున గారే తమన్నాతో చెప్పారు'' అని రోహిణి తెలిపింది.