Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
పీవీపీ భాగస్వామ్యంతో నాగార్జున కొత్త టీవీ ఛానల్!
హైదరాబాద్: నిన్న మొన్నటి వరకు నాగార్జున, చిరంజీవి, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరు భాగస్వామ్యంలో నడిచిన ‘మా టీవీ' నెట్వర్క్ ఛానల్స్ను..... స్టార్ ఇండియా వారు భారీ ఒప్పందంతో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ. 2000 కోట్లు ఉంటుందని అంచనా. సక్సెస్ ఫుల్గా నడుస్తున్న ‘మా టీవీ' నెట్వర్క్ ను ఎందుకు అమ్మేసారనేది అసలు ఎవరికీ అర్థం కాలేదు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కినేని నాగార్జున మరో టీవీ ఛానల్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ సినీ నిర్మాత, ఫైనాన్షియల్ ప్రసాద్ వి పొట్లూరి భాగస్వామ్యంతో కలిసి ఆయన ఈ కొత్త టీవీ ఛానల్ ప్రారంభించబోతున్నట్లు టాక్.
పూర్తి వినోదాత్మక కార్యక్రమాలతో సాగు ఈ చానల్ కు ‘మనం' అనే పేరు ఖరారు చేసినట్లు సమాచారం. టీవీ ఛానల్ ఏర్పాటుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ తెరవెనక సాగుతున్నాయని, ఏప్రిల్ 24 నుండి టెస్ట్ సిగ్నల్ రిలే పరీక్షించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు అటు నాగార్జున నుండి గానీ, ఇటు పీవీపీ నుండి గానీ ఎలాంటి ప్రకటన వెలువడే లేదు. త్వరలో నిజా నిజాలు తెలియనున్నాయి.