twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పీవీపీ భాగస్వామ్యంతో నాగార్జున కొత్త టీవీ ఛానల్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నిన్న మొన్నటి వరకు నాగార్జున, చిరంజీవి, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరు భాగస్వామ్యంలో నడిచిన ‘మా టీవీ' నెట్వర్క్ ఛానల్స్‌ను..... స్టార్ ఇండియా వారు భారీ ఒప్పందంతో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ. 2000 కోట్లు ఉంటుందని అంచనా. సక్సెస్ ఫుల్‌గా నడుస్తున్న ‘మా టీవీ' నెట్వర్క్ ను ఎందుకు అమ్మేసారనేది అసలు ఎవరికీ అర్థం కాలేదు.

    Nagarjuna’s Manam channel?

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కినేని నాగార్జున మరో టీవీ ఛానల్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ సినీ నిర్మాత, ఫైనాన్షియల్ ప్రసాద్ వి పొట్లూరి భాగస్వామ్యంతో కలిసి ఆయన ఈ కొత్త టీవీ ఛానల్ ప్రారంభించబోతున్నట్లు టాక్.

    పూర్తి వినోదాత్మక కార్యక్రమాలతో సాగు ఈ చానల్ కు ‘మనం' అనే పేరు ఖరారు చేసినట్లు సమాచారం. టీవీ ఛానల్ ఏర్పాటుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ తెరవెనక సాగుతున్నాయని, ఏప్రిల్ 24 నుండి టెస్ట్ సిగ్నల్ రిలే పరీక్షించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు అటు నాగార్జున నుండి గానీ, ఇటు పీవీపీ నుండి గానీ ఎలాంటి ప్రకటన వెలువడే లేదు. త్వరలో నిజా నిజాలు తెలియనున్నాయి.

    English summary
    We’ve heard that King Nagarjuna is all set to rock with yet another TV Channel. Grapevine has that he is partnering with businessman and producer Potluri Vara Prasad (PVP) to kick start a new channel named “Manam”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X