Don't Miss!
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- News Lok Sabha Election 2024: 102 సీట్లలో తొలి దశ పోలింగ్ పూర్తి- దాదాపు 60 శాతం ఓటింగ్..!
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సిద్దూపై ‘పుల్వామా’ దెబ్బ.. కామెడీ షో నుంచి ట్రాజెడీకి.. నెటిజన్ల ఆగ్రహంతో..
క్రికెటర్, టెలివిజన్ హోస్ట్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా ఉగ్రదాడి ఘటనపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిన సిద్దూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం ఆయనను ఇరుకున పెట్టింది. తాను హోస్ట్గా వ్యవహరిస్తున్న ది కపిల్ శర్మ షో నుంచి బయటకు రావాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
పుల్వామా దాడిపై సిద్ధూ కామెంట్
పుల్వామా ఉగ్రదాడిపై నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పందించారు. ఉగ్రవాదానికి మతం, దేశం సంబంధం లేదు అని వ్యాఖ్యానించారు. సిద్దూ చేసిన వ్యాఖ్యలు పాక్కు అనుకూలంగా ఉండటంతో వివాదంగా మారింది. పలువురు సిద్ధూ తీరును తప్పుపట్టారు.
సిద్ధూ స్థానంలో అర్చన పూరన్ సింగ్
సిద్ధూ చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారం రేపడంతో కపిల్ శర్మ షో నిర్వాహకులు ఆయనను కార్యక్రమం నుంచి తప్పించారు. సిద్ధూ స్థానంలో బాలీవుడ్ నటి అర్చన పూరన్ సింగ్ను నియమించారు. దీంతో సిద్దూకు కొంత అవమానం ఎదురైందనే వాదన వినిపిస్తున్నది.
సిద్దూ వ్యాఖ్యలు సమర్ధనీయం కాదు..
సిద్ధూ వ్యాఖ్యలు సమర్ధనీయం కాదు. టెలివిజన్కు చెడ్డపేరు వచ్చే పరిస్థితి ఉండటంతో అనూహ్యమైన నిర్ణయం తీసుకొన్నాం. వివాదంలోకి టీవీ చానెల్ కూరుకుపోకూడదనే భావించిన సిద్దూను తప్పించాం. ఈ షోకు సిద్ధూ దూరంగా ఉంటారు. అర్చన ఆయన స్థానంలో ఉంటారు అని టెలివిజన్ వర్గాలు వెల్లడించాయి.
ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి
గతంలో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన సిద్దూ వివాదంలో కూరుకుపోయారు. పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ చేసి ప్రమాణ స్వీకారానికి సిద్ధూ వెళ్లడాన్ని తప్పుపట్టారు. ఆ సమయంలో పాకిస్థాన్ ఆర్మీ జనరల్ ఒమర్ జావేద్ బైవాతో భేటి కావడం తీవ్ర వివాదానికి దారి తీసింది.