Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఈటీవీ న్యూస్ కొత్త ఛానల్ ప్రారంభం
కటక్ : ఈటీవీ న్యూస్ ఒడియా ఛానల్ సోమవారం భువనేశ్వర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ఛానల్ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం ఈటీవీ న్యూస్ ఒడియా ఛానల్ సహకరించాలని కోరారు. కార్యక్రమానికి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్, ఒడిశా ఎంపీ ప్రసన్నపాట్సానిలు గౌరవ అతిథులుగా హాజరయ్యారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఈటీవీ న్యూస్ నెట్వర్క్ హెడ్ జగదీశ్ చంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ ...ఈటీవీ న్యూస్ పలు ప్రాంతీయ భాషల్లో వార్తలు వెలువరిస్తూ ప్రజలకు చేరువయిందన్నారు. దేశంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతినిధులను నియమించడంలో ఈటీవీ తొలిఛానల్గా నిలిచిందన్నారు.
అలాగే...సమాచారంలో పక్షపాతం లేకుండా ప్రజాసమస్యలు వెలుగులోకి తీసుకొస్తూ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజలకు చేర్చడంలో ఈటీవీ న్యూస్ వారధిగా నిలుస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే సంఘటనలు అతి తక్కువ సమయంలో ప్రజల వద్దకు చేర్చడంలో ఈటీవీ న్యూస్ ముందుందని తెలిపారు.
కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు, ఒడిశాకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా అతిథులను జగదీశ్ చంద్ర శాలువ కప్పి సత్కరించారు. కార్యక్రమంలో ఈటీపీఎల్ సీఈవో బాపినీడు, పనోరమా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఆర్.సుబ్బనాయడు తదితరులు పాల్గొన్నారు.