Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కన్నడంలో మళ్లీ ఎస్పీ బాలసుబ్రమణ్యమే
బెంగళూరు : ఈటీవీ కన్నడలో బుల్లితెర వీక్షకుల్ని ఉర్రూతలూగించిన 'ఎదెతుంబి హాడువెను' (మన పాడుతా తీయగా తరహా పోగ్రాం) కార్యక్రమం మళ్లీ మీముందుకు వస్తోంది. ఈటీవీ కన్నడ న్యూస్ఛానల్లో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఛానల్ ముఖ్యుడు ఆర్.సుబ్బానాయుడు బెంగళూరులో ప్రకటించారు. వీక్షకుల విన్నపాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. చెవులారా నవ్య సంగీత ధ్వనులను ఆస్వాదించాలనే వారికి మరో పండుగే అన్నారు.
బాలల్లో దాగిన గానమాధుర్యాన్ని వెలికితెచ్చే ఈ విశిష్ట కార్యక్రమం ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఇందులో పాల్గొనాలంటే 9-12 ఏళ్ల వయస్సున్న బాలలు అర్హులు.
ప్రతీ ఎపిసోడ్కు సంగీత, సినీ రంగానికి చెందిన ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు. ఎంపిక ప్రక్రియ ఈనెల 17 నుంచి ప్రారంభిస్తారు. బెంగళూరులోని గాంధీభవన్లో 17, 18 తేదీల్లో, మైసూరులో- 19, హాసన్లో 20, మంగళూరులో 21, దావణగెరెలో 22, హుబ్లి-ధార్వాడలో 23న ఎంపికను నిర్వహిస్తారు.
ఇందులో పాల్గొనాలని ఆసక్తి ఉన్న బాలలు 9342456699 నెంబర్లో పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఇంకెందుకాలస్యం.. మీ నగరంలో ఏర్పాటయ్యే ఎంపిక ప్రక్రియలో పాల్గొని ఎంచక్కా మీ ప్రతిభను చాటుకోండి అంటున్నారు నిర్వాహకులు.