Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బిత్తిరి సత్తికి కరోనా పాజిటివ్.. మా టీవీని వణికిస్తున్న కమెడియన్.. యాంకర్ ప్రదీప్తో సహా..
ప్రముఖ యాంకర్, నటుడు, కమెడియన్ బిత్తిరి సత్తి కరోనావైరస్ బారిన పడ్డారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన కోవిడ్ 19 పరీక్షలు చేయించుకోగా కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. తనకు కరోనా సోకిన విషయాన్ని వెల్లడిస్తూ తన ఆరోగ్య పరిస్థితిని తెలిపారు. బిత్తిరి సత్తి చెప్పిన విషయాల ప్రకారం..
కొద్దిరోజులుగా జ్వరం, తలనొప్పి
గత కొద్దిరోజులుగా జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులతో బాధపడుతున్నాను. ఎందుకైనా మంచిదనే విషయంతో కరోనా పరీక్షలు చేయించుకొన్నాను. కరోనా టెస్టుల ప్రకారం కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నాను. నాకు కరోనా విషయమని తేలడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు లోనయ్యారు. అయితే కరోనా వ్యాధికి భయపడకూడదని వారికి ధైర్యం చెప్పాను అని బిత్తిరి సత్తి తెలిపారు.
సాక్షిలో గరం గరం వార్తలతో
అయితే బిత్తిరి సత్తి ఇటీవల సాక్షి టెలివిజన్లో చేరారు. గరం గరం వార్తలు పేరుతో ఓ షో చేస్తున్నారు. కేవలం బిత్తిరి సత్తికే కాకుండా ఆ టీమ్లోని కీలక వ్యక్తులకు కూడా కరోనా సోకింది. దాంతో వారందరూ సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం సాక్షిసంస్థలో ఇప్పుడు కరోనా వ్యాధి వ్యాప్తి అత్యంత చర్చనీయాశమవుతున్నది.
పలువురు ప్రముఖులతో ముఖాముఖి
ఇటీవల వంగపండు ప్రసాదరావు మరణించిన నేపథ్యంలో ప్రముఖు నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణమూర్తితో బిత్తిరి సత్తి ముఖాముఖి నిర్వహించారు. అలా పలువురిని కొన్ని ఎపిసోడ్స్లో కలిసి కార్యక్రమాలను చేశారు. ఈ క్రమంలో వారందరిలో గుబులు పెరిగినట్టు తెలుస్తున్నది.
మా టీవీ ఫంక్షన్కు బిత్తిరి సత్తి
ఇక కరోనా సోకిన విషయంతో మా టెలివిజన్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఇటీవల మా టెలివిజన్లో జరిగిన ఓ ఫంక్షన్కు బిత్తిరి సత్తి హాజరయ్యారు. ఆయనతోపాటు ప్రదీప్ లాంటి యాంకర్లు, ఇతర సినీ, టెలివిజన్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆ వేడుకకు హాజరైన వారంతా కరోనా భయాలతో ఉన్నట్టు సమాచారం.
Recommended Video
బిత్తిరి సత్తిని కలిసిన వారంతా కూడా
ఇటీవల కాలంలో బిత్తిరి సత్తిని కలిసిన వారంతా కరోనావ్యాధికి సంబంధించిన పరీక్షలు చేయించుకొంటున్నట్టు సమాచారం. అయితే బిత్తిరి సత్తిని ఇటీవల ఎవరెవరూ కలిసి ఉంటారనే విషయం అత్యంత ఆసక్తిగా మారింది. ఇటీవల కాలంలో బిత్తిరి సత్తిని కలిసిన వారిని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సన్నిహితులు కోరుతున్నారు.