Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
కూతురికి పెళ్లయినా అవేం తగ్గలేదు.. అలా అందరూ అనేసరికి, కన్నీళ్లు పెట్టుకున్న పోసాని కృష్ణ మురళి!
పోసాని కృష్ణమురళి అంటే తెలియను తెలుగు ప్రేక్షకులు లేరు. ఐలవ్యూ రాజా అంటూ తెగ పాపులర్ అయ్యారు. రచయితగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన నటుడిగా, డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. కెరీర్ ప్రారంభంలో సీరియస్ పాత్రలతో ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ గా సినీ ఆడియెన్స్ కు చేరువయ్యారు. అలాగే ఆపరేషన్ దుర్యోధన సినిమాతో దర్శకుడిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. తన కామెడీతో అందరినీ నవ్వించే ఆయన జీవితంలో పలు విషాదాలు కూడా ఉన్నాయి. పాపులర్ యాంకర్ సుమ లేటెస్ట్ షో సుమ అడ్డా. ఈ షోకి హాజరైన పోసాని కృష్ణ మురళి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
విశేషమైన గుర్తింపు..
ఇప్పటివరకు తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేశారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇంకొందరు యాంకర్ అంటే ఇలా ఉండాలి, యాంకరింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. ఎవరు పొందలేని విశేషమైన గుర్తింపు పొందుతారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకునే యాంకర్ సుమ కనకాల. ఎప్పటికప్పుడూ అప్డేట్ అవుతూ తన యాంకరింగ్ తో అలరిస్తుంటుంది సుమ.
ప్రధానం కారణం సుమ..
ఎంతో కాలంగా ఓ ప్రముఖ ఛానెల్లో ప్రసారం అవుతూ అంతులేని కామెడీని అందించిన క్యాష్ షో గురించి అందరికీ తెలిసిందే. జబర్ధస్త్, ఎక్స్స్ట్రా జబర్ధస్త్ తర్వాత అంతటి ప్రేక్షకాదరణను అందుకుంటోన్న షో ఇది. పేరుకు గేమ్ షోనే అయినా కామెడీ ప్రధానంగా రన్ అయింది. ఈ కార్యక్రమం ఎంతో సక్సెస్ కావడానికి ప్రధాన కారణం యాంకర్ సుమ కనకాల అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే సుమ కనకాల తనదైన కామెడీ పంచ్ లతో హీరో హీరోయిన్లు ఎవరనేది చూడకుండా ఎంటర్టైన్ చేస్తుంది.
సెలబ్రిటీలను రోస్ట్ చేస్తూ..
ఇదిలా ఉంటే సుమ చేసిన అనేక కార్యక్రమాలు, టీవీ షోలు చాలా వరకు సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అందులో 'క్యాష్' కూడా ఒకటని తెలిసిందే. ఇటీవల క్యాష్ పోగ్రాన్ని ముగించారు. దాని స్థానంలో 'సుమ అడ్డా' అనే మరొ కొత్త షోను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ షోకి వివిధ సెలబ్రిటీలను ఆహ్వానించిన సుమ తన కామెడీ పంచ్ లతో రోస్ట్ చేస్తుంటుంది. ఇప్పటికే ఈ షోకి వాల్తేరు వీరయ్య, కల్యాణం కమనీయం టీమ్స్ సందడి చేయగా.. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వచ్చి ఎంటర్టైన్ చేశారు.
ఎందుకు అవన్నీ..
సుమ అడ్డా షోకి తాజాగా టాలీవుడ్ ప్రముఖ కమెడియన్స్ గా పేరొందిన అలీ, పోసాని కృష్ణ మురళి హాజరయ్యారు. కృతయుగం, ద్వాపర యుగం ఎన్ని యుగాల నుంచి ఉన్నారు అలీ గారు అంటూ అలీనీ.. మీరు సినిమాల్లో రాజా అని పిలిచిన అన్ని సార్లు నేను మా రాజాను కూడా అన్ని సార్లు అనలేదు అని పోసానితో కామెడీ చేసింది యాంకర్ సుమ. ముబైల్ ఉండటం మంచిదా లేకపోవడం మంచిదా అని సుమ అడిగింది. దానికి ఇందులో ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్, ఎప్పుడన్నా చిన్న చిన్నమెసేజ్ లు అని పోసాని చెబుతుంటే.. మీకు వాట్సాప్ లేదు, ఇన్ స్టాగ్రామ్ లేదు, ఫేస్ బుక్ లేదు అని సుమ అంది. దీంతో ఎందుకు అవన్నీ అని పంచ్ వేశాడు పోసాని.
అస్సలు తగ్గలేదు..
తర్వాత ఆడియెన్స్ లో ఒక అమ్మాయి మొబైల్ లేకపోతే ఎలా మంచిదో వివరిస్తుంది. దీనికి మీకు ఈ ఆన్సర్ నచ్చిందా అని అలీని అడిగింది సుమ. నచ్చింది అని అలీ అన్నాడు. నచ్చితే ఒక్కటి ఇస్తారా అని చాక్లెట్ ఇచ్చింది సుమ. అప్పుడు నేనే ఇస్తా అని.. నవ్వుతూ వెళ్లి ఆ అమ్మాయికి చాక్లెట్ ఇచ్చాడు అలీ. కూతురుకు పెళ్లి అయినా ఇవేం అస్సలు తగ్గలేదు అని పోసానితో చెబుతూ పంచ్ వేసింది సుమ కనకాల. దీనికి పోసాని తెగ నవ్వేశారు.
అందరూ అడిగేసరికి పొలానికి వెళ్లి..
కొన్ని స్కిట్ లు, కామెడీ తర్వాత.. పోసాని గారు మీ నాన్న గురించి ఏమైనా చెబుతారా అని సుమ అడిగింది. ఆయన మా చిన్నప్పుడే చనిపోయారు. ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. కానీ ఎవడో పేకాట నేర్పాడు. ఇక ఊళ్లో వాళ్లందరు ఎందుకు సుబ్బరావు ఇలా చేస్తావ్ అని అన్నారు.. దానికి ఆయన సమాధానం చెప్పుకోలేక.. పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి అక్కడే చనిపోయారు అని ఎమోషనల్ అయ్యారు పోసాని కృష్ణమురళి. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.