Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
జబర్ధస్త్ జంటపై పోసాని కృష్ణ మురళి సెన్సేషనల్ కామెంట్స్: చాలా డౌట్లు.. నరాలు కట్ అవుతాయ్ అంటూ!
టెలివిజన్ హిస్టరీలోనే ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ.. చాలా కాలంగా నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. దీనికి ఆరంభం నుంచే ప్రేక్షకుల మద్దతు లభించడంతో భారీ స్థాయిలో రేటింగ్ కూడా లభిస్తోంది. అందుకే వారంలో రెండు రోజుల పాటు ప్రసారం అయినప్పటికీ.. స్పందనను మాత్రం ఏమాత్రం తగ్గించుకోకుండా దూసుకెళ్తోంది. ఇక, ఈ షో ద్వారా ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. వారిలో ఇమాన్యూయేల్ - వర్ష మాత్రం జంటగా పాపులర్ అయ్యారు. తాజాగా ఈ జోడీపై నటుడు పోసాని కృష్ణ మురళి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు మీకోసం!
జబర్ధస్త్ వల్ల ఎంతో మంది... స్టార్లుగా
తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా కొనసాగుతోంది జబర్ధస్త్. దీని వల్ల ఎంతో మంది టాలెంట్లు వెలుగులోకి వచ్చాయి. అద్భుతమైన యాక్టింగ్ చేయగల నైపుణ్యం ఉండి.. అవకాశాలు లేని వందలాది మందికి ఇది వేదికగా మారింది. అలా ఎంతో మంది బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్లలో చాలా మంది తక్కువ సమయంలోనే టాలెంట్లను నిరూపించుకుని స్టార్లుగా ఎదిగిపోయారు.
వీళ్లు అలా వచ్చారు.. ఇలా పాపులర్
హైపర్ ఆది టీమ్ ద్వారా జబర్ధస్త్లోకి ఎంట్రీ ఇచ్చి.. అనతి కాలంలోనే ఊహించని రీతిలో క్రేజ్ను అందుకుంది వర్ష. అంతకు ముందే పలు సీరియళ్లలో నటించినా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, ఈ షో వల్ల ఫుల్ పాపులర్ అయింది. అలాగే, 'పటాస్' అనే షో ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు ఇమాన్యూయేల్. ఈ క్రమంలోనే జబర్ధస్త్లోకి వచ్చి టాప్ కమెడియన్గా మారిపోయాడు.
ఆ జంట తర్వాత బాగా ఫేమస్ జోడీ
జబర్ధస్త్ షో ద్వారా ఎంతో మంది వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో యాంకర్ రష్మీ గౌతమ్.. కమెడియన్ సుడిగాలి సుధీర్ మాత్రం విపరీతమైన స్థాయిలో క్రేజ్ను అందుకున్నారు. ఈ షోలో వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తున్నట్లు చూపించడమే దీనికి కారణం. వీళ్ల తర్వాత కొత్తగా వర్ష - ఇమాన్యూయేల్ జంట కూడా క్రమక్రమంగా పాపులర్ అవుతోంది.
రొమాన్స్తో రచ్చ.. హగ్స్, కిస్సెస్తో
కెవ్వు కార్తీక్ టీమ్లో స్కిట్ల కోసం ఇమాన్యూయేల్.. వర్షను జంటగా చూపిస్తున్నారు. అదే సమయంలో వీళ్లిద్దరినీ హైలైట్ చేస్తున్నారు. ఇందుకోసం లవ్ ట్రాకును కూడా క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్త పరచుకోవడంతో పాటు అప్పుడప్పుడూ హగ్గులిచ్చుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం వంటివి చేస్తున్నారు. దీంతో తరచూ వార్తల్లో ఉంటున్నారు.
డ్రామా మొదలు పెట్టిన మల్లెమాల
'శ్రీదేవి డ్రామా కంపెనీ' పేరుతో ఈటీవీలో మరో కామెడీ షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ప్రది ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయ్యే ఈ కార్యక్రమాన్ని మల్లెమాలనే రూపొందిస్తోంది. ఇందులో యాంకర్గా 'దేవత' సీరియల్ హీరో అర్జున్ వ్యవహరిస్తున్నాడు. కమెడియన్ ఇమ్మానుయేల్, వర్ష జోడీగా కనిపిస్తున్నారు. దీంతో ఈ షో కూడా మంచిగా సాగుతోంది.
ప్రేమ జంటలను పిలిచి రొమాంటిక్గా
ప్రేమికుల రోజును పురస్కరించుకుని వచ్చే వారం 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కార్యక్రమాన్ని స్పెషల్గా డిజైన్ చేశారు. ఇందులో పలు బుల్లితెర జంటలు సందడి చేయబోతున్నాయి. అలాగే, ఇమ్మానుయేల్, వర్ష జోడీ కూడా రొమాంటిక్గా కనిపించింది. ఇక, ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి గెస్టుగా విచ్చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.
జంటపై పోసాని సెన్సేషనల్ కామెంట్స్
ఈ షోలో ఇమాన్యూయేల్.. వర్షకు మోకాళ్లపై కూర్చుని మరీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశాడు. అప్పుడు ఎంటరైన పోసాని 'మీ ఇద్దరి మధ్య ఏముంది నాన్న' అంటూ ప్రశ్నించాడు. దీనికి ఇమ్మూ 'ప్రేముంది సార్' అంటూ బదులిచ్చాడు. దీంతో పోసాని 'వామ్మో ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయ్యాయి' అనడంతో పాటు చాలా డౌట్లన్నాయి అని కామెంట్ చేశారాయన.