Don't Miss!
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- News సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వే
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
బిగ్ అనౌన్స్మెంట్.. ప్రభాస్ 21 ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?
ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీనిచ్చే వార్త ఒకటి వచ్చింది. డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఒక్క అప్డేట్ ఇవ్వండని తమ గోడును వెలిబుచ్చుకుంటున్న వేళ.. అదిరిపోయే అప్డేట్ వచ్చింది. అయితే ఈ అప్డేట్ ప్రభాస్ 20వ చిత్రానికి సంబంధించినది మాత్రం కాదు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం (ఓ డియర్ అంటూ టాక్) తరువాత చేయబోయే ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చింది. నిర్మాత, దర్శకుడు ఎవరన్నది.. ఓ సారి చూద్దాం.
Recommended Video
ప్రస్తుతం ఓ డియర్ అంటూ..
బాహుబలి, సాహో చిత్రాలతో ప్రభాస్ ఇమేజ్ ఏ రేంజ్లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ప్రభాస్ మ్యానియాతోనే బాక్సాఫీస్ వద్ద రూ. 300కోట్ల మేర వసూళ్లు వచ్చాయంటేనే డార్లింగ్ రేంజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ప్రభాస్ ఓ విభిన్న ప్రేమ కథా చిత్రాన్ని చేస్తున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ వాయిదా పడుతూ వస్తోంది.
తాజాగా కొత్త షెడ్యూల్..
తాజాగా హైద్రాబాద్లోనే ఓ సెట్ వేసి షూటింగ్ ప్రారంభించారు. అయితే ఎంతో అట్టహాసంగా మొదలు పెట్టిన ఈ మూడో షెడ్యూల్కు ఆదిలోని కష్టాలు మొదలయ్యాయి. అన్నపూర్ణలో భారీ సెట్ వేసి అంతా రంగం సిద్దం చేయగా.. అనారోగ్య కారణాల వల్ల పూజా హెగ్డే షూటింగ్కు డుమ్మా కొట్టింది. ఇక చేసేదేమీ లేక కొన్ని సీన్స్ అలాగే తెరకెక్కించారని టాక్.
|
తాజాగా కొత్త అప్డేట్..
అయితే డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ 20వ చిత్రంపై, యూవీ నిర్మాణ సంస్థపై గుస్సా అవుతున్నారు. ఏ చిన్న అప్డేట్ కూడా ఇవ్వడం లేదని, ప్రభాస్ చిత్రాన్ని నాశనం చేస్తున్నారని ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు. ఈ మూవీకి సంబంధించి ఒక్క అప్డేటైనా ఇవ్వండంటూ.. అభిమానులు ప్రాధేయపడుతున్నారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో..
ఇలాంటి తరుణంలో ప్రభాస్ తదుపరి చిత్రం గురించి ఓ అప్డేట్ వచ్చింది. మహానటి సినిమాతో అటు దర్శకుడిగా నాగ్ అశ్విన్, ఇటు నిర్మాణ సంస్థగా వైజయంతీ మూవీస్కు మంచి పేరు వచ్చింది. మహానటి తరువాత మరో ప్రాజెక్ట్ తెరకెక్కించని నాగ్ అశ్విన్ ప్రభాస్తో ఓ సినిమా చేయనున్నట్లు వైజయంతీ సంస్థ ప్రకటించింది.