కొంచెం టచ్లో ఉంటే చెప్తా సీజన్ 4 రెడీ.. ప్రభాస్తో యాంకర్ ప్రదీప్?
టాలీవుడ్లోని స్టార్ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి.. ఎవరికీ తెలియని మరో కోణాన్ని తెలియజేసే కార్యక్రమం కొంచెం టచ్లో ఉంటే చెప్తా. గత మూడు సీజన్ల నుంచి యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్గా ఈ షోను మరో లెవెల్కు తీసుకెళ్లాడు. తాజాగా కొంచెం టచ్లో ఉంటే చెప్తా సీజన్ 4 మరో సారి సిద్దమయ్యాడు. సరికొత్తగా, గత సీజన్లకు భిన్నంగా ఈ షోను శనివారం ప్రదీప్ ప్రారంభించనున్నారు.
శనివారం నిర్వహించబోయే ప్రీ లాంచ్ లైవ్ ఎపిసోడ్ను ప్రదీప్ మాచిరాజు క్రేజీగా ప్రారంభించనున్నారు. ఫోన్ కాల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా అభిమానులతో, వీక్షకులతో మాట్లాడున్నారు. ఈ కార్యక్రమంలో తమ అభిమాన నటుల గురించి మరింత సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రదీప్ మాచిరాజు ప్రారంభించే ప్రీ లాంచ్ లైవ్ కార్యక్రమం జూలై 6వ తేదీ శనివారం రాత్రి 9 గంటలకు ప్రారంభం కానున్నది. జీ తెలుగు, జీ తెలుగు హెచ్ డీ, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్లో ఈ కార్యక్రమాన్ని చూసి ప్రేక్షకులు ఆనందించడానికి అవకాశం ఉంది.

ఇక కొంచె టచ్లో ఉంటే చెప్తా సీజన్ 4లో తొలి గెస్ట్గా ప్రభాస్ రానున్నట్టు సమాచారం. సాహో ప్రమోషన్ కోసం ఈ షోలో పాల్గొనే అవకాశం ఉంది. జీ టెలివిజన్ అందుకు తగినట్టుగా ఏర్పాట్లను చేస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











