తెలంగాణ గురించి ప్రశ్నించిన అమితాబ్ బచ్చన్

ఇటీవల జరిగిన కౌన్ కరోడ్ పతి-7 ఎపిసోడ్లో రాజస్థాన్కు చెందిన వ్యక్తి పాల్గొన్నాడు. అపుడు ఆ అభ్యర్థిని తెలంగాణ అంశంపై ప్రశ్నించాడు అమితాబ్. భరత మాతకు జన్మించబోతున్న 29వ బేబీ ఎవరు అని ప్రశ్నించగా....వెంటనే అతను తెలంగాణ అని సమాధానం ఇచ్చాడు.
ప్రశ్న ఈ విధంగా ఉంది....
66వ ఏట మదర్ ఇండియా జన్మనివ్వబోతున్న 29వ బేబీ ఎవరు? అనేది ప్రశ్న కాగా దానికి... 1) ద రాయల్ బేబీ, 2) తెలంగాణ, 3) ఐఎన్ఎస్ విక్రాంత్, 4)నర్గీస్ లాస్ట్ రిలీజ్ కాని సినిమా అనేవి అప్షన్లుగా ఇచ్చారు. దీనికి 'తెలంగాణ' అనేది సరైన సమాధానం.
'కౌన్ బేనేగా కరోడ్ పతి' కార్యక్రమం విశేషాల్లోకి వెళితే.....రూ.1 కోటి ఫ్రైజ్ మనీతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు తొలి 6 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని 7వ సీజన్లోకి అడుగు పెట్టింది. 7వ సీజన్ సందర్భంగా ఫ్రైజ్ మనీ రూ.7 కోట్లకు పెంచారు.


Click it and Unblock the Notifications











