Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాఘవేంద్రరావు గారు ఆ పని చేస్తారంటే ఆశ్చర్యం
ప్రస్తుతం నాగార్జున కూడా గేమ్ షోతో మాటీవీలో అదరకొడుతున్నారనే సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ ప్రయోక్తగా వ్యవహరించగా అత్యంత ప్రజాదరణ పొందిన గేమ్ షో 'కౌన్ బనేగా కరోడ్పతి' (కేబీసీ) తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' (ఎంఈకే) పేరుతో మాటీవీలో వస్తోంది. ఈ తెలుగు వెర్షన్కు తెలుగు సినిమా అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున ప్రయోక్తగా వ్యవహరిస్తున్నారు. తెలుగు టెలివిజన్ చరిత్రలో కోటి రూపాయల ప్రైజ్ మనీతో ఓ గేమ్ షో ప్రసారం కానుండటం ఇదే ప్రథమం.
'డిన్నర్ పార్టీ' అనేది సరైన సమాధానమని కంప్యూటర్ చూపించింది. 38 మంది సెలబ్రిటీలను పరిశీలించి, చివరకు ప్రయోక్తగా 'ట్రూ హ్యూమన్బీయింగ్' అయిన నాగార్జునను ఎంచుకున్నామని మా టీవీ ఛైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ చెప్పారు. టెలివిజన్ రంగంలో ఇది గేమ్ చేంజర్ అవుతుందని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ కూడా టెలివిజన్ రంగం తరహాలో ఆర్గనైజ్డ్గా మారితే విజయవంతంగా నడుస్తుందని చానల్ డైరెక్టర్ అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు. 'కేబీసీ' సృష్టికర్త, బిగ్ సినర్జీ సీఎండీ అయిన సిద్ధార్థ బాసు మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ఏడాదిన్నర కాలంలో తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 480 ఎపిసోడ్లను పూర్తి చేసుకుందనీ, ఈ షో ఆధారంగా 'స్లమ్డాగ్ మిలియనీర్' సినిమా స్క్రిప్టు తయారయ్యిందనీ చెప్పారు.
ఇంతకాలం సినిమాల ద్వారా వినోదం పంచుతూ వచ్చిన తాను మొదటిసారి టెలివిజన్ తెరపైకి వస్తున్నానని నాగార్జున అన్నారు. ఒక సామాజిక బాధ్యతతో ఈ గేమ్ షోకు ప్రయోక్తగా వ్యవహరిస్తున్నాననీ, అమితాబ్ ముద్రను అందుకోవడం చాలా కష్టమని తెలుసనీ, తన శక్తివంచన లేకుండా బాగా చేయడానికి కృషి చేస్తాననీ చెప్పారు. చాలా మంది సామాన్య పౌరుల కలల్ని నిజం చేయడం ద్వారా వారి జీవితాల్ని ఈ షో మార్చబోతోందని ఆయన అన్నారు.