Don't Miss!
- Automobiles జనరల్ టికెట్ ప్యాసింజర్స్తో ఫుల్ రష్గా రిజర్వ్డ్ కోచ్లు.. ప్రయాణికుడి కంప్లెయింట్, రైల్వే శాఖ సీరియస్
- News జగన్ సోషల్ ఇంజనీరింగ్ లెక్కలకు ఎన్డీయే కూటమి సవాల్ ఇలా..!
- Technology వన్ప్లస్ నార్డ్ CE 4 ధరల వివరాలు లీక్.. గత మోడల్ కంటే తక్కువ ధరకే అందుబాటులోకి..!
- Sports Kavya Maran: తిలక్ వర్మ..నీకు దండంరా బాబు! video
- Finance Stock Market: భారీ లాభాల్లో విహరిస్తున్న సెన్సెక్స్-నిఫ్టీ.. అంతా బుల్స్ హవాతోనే..
- Lifestyle Car Vastu Tips: కారు ఉందా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి..ఈ డైరెక్షన్ లో పార్క్ చేస్తే
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
టీవీ సీరియల్ ఎపిసోడ్ డైరక్ట్ చేస్తూ నటించిన రాజమౌళి
ఈ విషయమై రాజమౌళి మాట్లాడుతూ...''బుల్లితెర అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే సినిమాల్లోకి రాకముందు నేను కూడా 'శాంతి నివాసం' ధారావాహిక కోసం పనిచేశా. వంద భాగాలు పూర్తి చేయడమే గగనం అనుకొనేవాళ్లం. అలాంటిది 'చంద్రముఖి' ఇన్ని రోజులుగా ప్రదర్శితమవ్వడం ప్రశంసనీయం. ప్రేక్షకుల నుంచీ చక్కటి ఆదరణను సొంతం చేసుకొంది. ఇది రెండు వేల భాగాల వరకూ నిరాటంకంగా కొనసాగాలి. ఆ ప్రత్యేక భాగంలోనూ అవకాశమిస్తే నటిస్తాను. ఆర్కా సంస్థతో 'మర్యాద రామన్న' సినిమా రూపొందించా. త్వరలో ప్రభాస్ హీరోగా ఈ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఆ సినిమాకి దర్శకత్వం వహిస్తాను'' అన్నారు.
ఈ సీరియల్కి యాట సత్యనారాయణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీతినిగమ్, మంజుల, నవీన, నిరుపమ్, చలపతిరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమా దర్శకులు అప్పుడప్పుడూ బుల్లి తెరపై దర్శనమివ్వడం మామూలే. గేమ్ షోలాంటి కార్యక్రమాల్లోనే తళుక్కున మెరుస్తుంటారు. కానీ ఇలా ఓ ధారావాహికలో అతిథిగా కనిపించడం అరుదే. 'చంద్రముఖి' ఆ ప్రత్యేకతను సాధించింది. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి 'చంద్రముఖి' కోసం బుల్లి తెరపైకి రావటం క్రేజ్ తెస్తుందని భావిస్తున్నారు.
టెలీకాస్ట్ సమయం: ప్రతి రోజు రాత్రి 8 గం.లకు ఈటీవీలో ప్రసారమవుతుంది. గురువారం ఈ ఎపిసోడ్ లో అంటే ఈ రోజు కనిపించనున్నారు.