Don't Miss!
- News ఘర్ వాపసీ: రేవంత్ రెడ్డిని కలిసిన కేకే, కేసీఆర్ గౌరవం ఇచ్చారు కానీ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
రానాకు టాటూ ఎక్కడంటే.. ర్యాగింగ్ చేసిన రకుల్ ప్రీత్, మంచు లక్ష్మీ
బహుముఖ ప్రజ్ఞాశాలి రానా దగ్గుబాటికి లాక్డౌన్ ఉందా? లేదా అనే విషయం అక్కర్లేదు. నటుడిగా, నిర్మాతగా, హోస్ట్గా తన పని తాను చేసుకొంటూ వెళ్తుంటారు. తాజాగా నంబర్ 1 యారీ అనే షోను ఆహా ఓటీటీ యాప్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో భాగంగా తాజా ఎపిసోడ్ కోసం క్రేజీ స్టార్స్ మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్ను ఆహ్వానించారు. అయితే ఈ ఎపిసోడ్లో రానాను వారిద్దరు ఎలా ఆటపట్టించారంటే..
రానా సీటును రకుల్ కబ్జా
నంబర్ 1 యారీ షో ప్రారంభానికి ముందే మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్ సెట్లో తిష్ట వేశారు. ఇక వారీ అల్లరి తెలుసుకొన్న రానా పరుగు పరుగునా అక్కడికి చేరుకొన్నారు. అయితే అప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ తన సీటును కబ్జా చేయడంతో చేసేది ఏమీలేక మంచు లక్ష్మీ పక్కనే రానా సెటిల్ అయ్యారు. ప్రేమగా ఓ కౌగిలింత ఇచ్చి షోలోకి వెళ్లిపోయారు.
రకుల్ ప్రశ్నలతో రానా షాక్
హోస్ట్ సీటులో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఘాటైన ప్రశ్నతో రానాకు షాకిచ్చారు. రానా ఏదైనా పేరును టాటూ వేయించుకోవాలంటే అంటూ రకుల్ ప్రీత్ ప్రశ్న వేయగా.. వెంటనే ఎక్కడ వేయించుకొంటాడా అని మంచు లక్ష్మీ క్లారిటీ తీసుకోవడానికి ప్రయత్నించారు. అంతలోనే రానా మధ్యలో జోక్యం చేసుకొంటూ ఎక్కడ వేయించుకొంటాడా అని కాదు.. ఏం వేయించుకొంటాడు అని సర్ధిచెప్పారు.
మంచు లక్ష్మీ, రకుల్ రచ్చ
మేమిద్దరం కలిస్తే.. పాత విషయాలను అడుగుతావని అనుకొన్నాను అంటూ రకుల్ ప్రీత్ను మంచు లక్ష్మీ అడిగింది. ఆ తర్వాత రానా తన హోస్ట్ సీటులోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఉప్పు కప్పురంబు పద్యాన్ని అడిగితే మంచు లక్ష్మీ సమాధానం ఇస్తూ కనిపించింది. డైరెక్ట్ ప్రశ్నలకు అడగకుండా టైమ్ వేస్ట్ చేయడం ఎందుకు అంటూ మంచు లక్ష్మి విసిగిపోయినట్టు కనిపించింది.
లేడీస్ ఏమిటీ ఈ లొల్లి
నేను వద్దని చెప్పిన తర్వాత కూడా వస్తాడు అంటూ రకుల్ ప్రీత్ అంటే.. లేడీస్ ఏం మాట్లాడుతున్నారు అంటూ రానా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నీవు ఐస్ క్రీమ్ బాయ్లా మారిపోయావు.. అంటూ రానాను ఏదో అంటూ మంచు లక్ష్మీ కనిపించారు. ఇలా సరదగా మంచు లక్ష్మీ తనదైన శైలిలో డైలాగ్స్ కొడుతూ కనిపించారు.
Recommended Video
రానాను ర్యాగింగ్ చేస్తూ..
ఇలా రానా షోలో రకుల్ ప్రీత్, మంచు లక్ష్మీ బాగానే రచ్చ చేసినట్టు కనిపించారు. రకరకాల ప్రశ్నలతో రానాను ఆటపట్టించినట్టు స్పష్టంగా కనిపించింది. ఓ దశలో రానాను ఇద్దరు కలిసి ర్యాంగింగ్ చేశారా అన్నంతగా ఎపిసోడ్లో సన్నివేశాలు కనిపించాయి. ఆదివారం మే 2వ తేదీన ప్రసారం అయ్యే ఎపిపోడ్ ఫన్నీగా సాగినట్టు అనిపించింది.