Don't Miss!
- News క్రైస్తవ పాఠశాలపై హిందువుల దాడి
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
నాగార్జున తో చేయటం హ్యాపీగా ఉంది : రకుల్ ప్రీతి సింగ్
హైదరాబాద్ : తెలుగు టీవీ ప్రేక్షకులను ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' అంటూ అలరించిన నాగార్జున మరోసారి సరికొత్త ఎపిసోడ్స్ తో మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు( డిసెంబర్ 8) నుంచి ప్రారంభం కాబోతున్న రెండవ ఎపిసోడ్ మొదటి ఎపిసోడ్ కు ఏమాత్రం తగ్గకుండా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి ఐదు రోజుల పాటు ఈ షో అలరించనుంది.
అక్కినేని నాగార్జున హోస్ట్గా నిర్వహించిన ఈ కార్యక్రమం మొదటి సీరిస్ ముగిసిన నాలుగు నెలల వ్యవధిలోనే తిరిగి ప్రేక్షకుల ముందుకు మళ్లీ వస్తోంది. ఈ షోలో ఇప్పటికే నితిన్ మీద ఎపిసోడ్ షూట్ చేసారు. అలాగే... ఇప్పుడు రకుల్ ప్రీతి సింగ్ మీద సైతం ఓ పోగ్రాం షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రకుల్ ట్విట్టర్ ద్వారా ఖరారు చేసింది.
రకుల్ ట్వీట్ చేస్తూ... " మీలో ఎవరు కోటీశ్వరుడు పోగ్రాం ఎవర్ గ్రీన్ నాగార్జున తో కలిసి పాల్గొనే అవకాసం రావటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.. !! నేను చాలా ఎంజాయ్ చేసాను! ," అన్నారామె.
@Rakulpreet
attended
Meelo
Evaru
Koteshwarudu
looking
prettyyyy
in
H&M
and
Chanel
💕😊
pic.twitter.com/HqK5KRhENj
—
Neeraja
Kona
(@NeerajaKona)
December
5,
2014
ఇక ఈ షోలో పాల్గొనాలనుకుంటున్న వారికి ఎంపిక ప్రక్రియ కోసం ప్రత్యేక విధానాలను అనుసరించారు. అక్టోబర్ 9 నుంచి 18 రోజుల పాటు ప్రసారం చేసిన ప్రశ్నలకు ప్రేక్షకుల నుంచి అపూర్వస్పందన లభించింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన 34.50 లక్షల ఎస్ఎంఎస్లు/ఐవిఆర్ఎస్ల నుంచి అర్హుల ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా చేపట్టారు. హాట్సీట్కు చేరుకున్న కంటెస్టెంట్ కోటి రూపాయల వరకు ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం ఉంటుంది.
Such
an
honour
to
be
at
meelo
evaro
koteshwaradu(
kbc
south)
with
the
evergreen
Nagarjuna
sir!!
Njoyed
do
much!
pic.twitter.com/OP0L0csT7A
—
Rakul
Preet
(@Rakulpreet)
December
5,
2014
నాగార్జున బుల్లితెరపైకి అరంగేట్రం చేస్తూ చేసిన రియాలిటీ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ షో హిందీలో బాగా ఫేమస్ అయిన కౌన్ బనేగా కరోడ్పతి షోకి రీమేక్ వెర్షన్. ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ద్వారా నాగార్జున తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కావడమే కాకుండా టిఆర్పి రేటింగ్స్ లో రికార్డ్స్ సృష్టించాడు. ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం సెకండ్ సీజన్ రేపటి నుంచి(డిసెంబర్ 8న) ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ రెండవ సీజన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయంగా అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ గే మ్ షోని బిగ్ సినర్జీ నిర్మిస్తోంది.