Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ఎన్టీఆర్ షోలో చరణ్ ఆట అదుర్స్: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఎపిసోడ్ లీక్.. మెగా హీరో ఎంత గెలిచాడంటే!
తెలుగు బుల్లితెరపై భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుని సక్సెస్ఫుల్ షోగా పేరు తెచ్చుకున్న వాటిలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ఒకటి. హిందీలో ప్రసారం అవుతోన్న 'కౌన్ బనేగా కరోడ్పతీ' ఆధారంగా ప్రసారం అవుతోన్న ఈ షో ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక, ఎన్నో రకాల మార్పులతో జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా ఐదో సీజన్ను ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన షూట్ పూర్తైపోయింది. ఈ నేపథ్యంలో దీనికి ఫస్ట్ గెస్టుగా వచ్చిన రామ్ చరణ్ ఎపిసోడ్ లీకైంది. అతడు ఎంత గెలిచాడో తెలిసిపోయింది. ఆ సంగతులు మీకోసం!
తెలుగులోనూ సక్సెస్.. ఇద్దరు స్టార్లు
సామాన్య ప్రజలను కోటీశ్వరులుగా మార్చాలన్న లక్ష్యంతో మొదలైనే కార్యక్రమమే 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి వచ్చిన ఈ షో.. ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇందులో మొదటి మూడింటినీ అక్కినేని నాగార్జున.. నాలుగో దాన్ని మాత్రం చిరంజీవి హోస్ట్ చేశారు. తద్వారా షో విజయంలో భాగం అయ్యారు.
తెలుగులో ఎక్కువ టీఆర్పీ రేటింగ్ సాధించిన సినిమాలు ఇవే: మహేశ్, బన్నీ రికార్డు.. పవన్కు దక్కని చోటు
ఐదోది కొత్తగా... అంచనాలు ఓ రేంజ్
'మీలో ఎవరు కోటీశ్వరుడు' నాలుగు సీజన్లు పూర్తైన తర్వాత ఎందుకనో దీన్ని మళ్లీ ప్రసారం చేయలేదు. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత ఈ షోను తీసుకొస్తున్నారు. అయితే, ఈ సారి దీనికి 'ఎవరు మీలో కోటీశ్వరులు' అని టైటిల్ మార్చారు. అంతేకాదు, ఈ సారి ఈ షోను స్టార్ మాలో కాకుండా జెమినీ టీవీలో ప్రసారం చేయబోతున్నారు. దీంతో ఈ సీజన్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఎప్పుడో అనుకుంటే.. స్టార్ట్ కాలేదుగా
సామాన్యుల షోగా పేరొందిన 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ప్రోమోను ఆ మధ్య విడుదల చేశారు. 'మీ జీవితాలని మార్చే గేమ్ షో.. మీ ఆశలని నిజం చేసే గేమ్ షో ''ఎవరు మీలో కోటీశ్వరులు'' త్వరలో మీ జెమినీ టీవీలో రాబోతుంది సిద్ధంగా ఉండండి' అంటూ వీడియో ద్వారా ప్రకటించారు. అయితే, ఆ తర్వాత కరోనా సెకెండ్ వేవ్ కారణంగా దీన్ని అనుకున్న టైమ్కు మొదలెట్టలేదు.
రంగంలోకి దిగిన తారక్.. షూట్ స్టార్ట్
'మీలో ఎవరు కోటీశ్వరుడు'ను గతంలో నాగార్జున, చిరంజీవి నడిపించగా.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ షోను సక్సెస్ చేసిన అతడు.. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు'ను కూడా అదే రీతిలో నడిపించేందుక రెడీ అవుతున్నాడు. పరిచయ ప్రోమోలో తన పేరు రామారావు అని చెప్పి షోపై అంచనాలు పెంచేశాడు తారక్. ఇటీవలే షూట్లో పాల్గొన్నాడు.
మొదటి షెడ్యూల్ పూర్తి.. ఏకంగా 16
'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు సంబంధించి అందుతోన్న తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తైందట. అంతేకాదు, మొదటి షెడ్యూల్లో భాగంగా ఏకంగా 16 ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. అందులో ప్రారంభ ఎపిసోడ్ కూడా ఉందని అంటున్నారు. ఇవన్నీ ఎంతో చక్కగా వచ్చాయన్న టాక్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
ఫస్ట్ గెస్టుగా చరణ్.. ఎపిసోడ్ డీటేల్స్
తారక్ హోస్టు చేస్తోన్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ గెస్టుగా రాబోతున్నాడని ఇటీవలే ఓ న్యూస్ లీకైంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ ఎపిసోడ్ కూడా ఇప్పటికే పూర్తైందని తెలుస్తోంది. ఇందులో మెగా హీరోతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ చేసిన సందడి వేరే లెవెల్లో ఉంటుందని సమాచారం. దీన్ని ఆగస్టు 15 లేదా 16న ప్రసారం చేస్తారట.
Thimmarusu Twitter Review: సత్యదేవ్ ఖాతాలో మరొకటి.. ఏ సినిమాలో లేనన్ని.. ఇంతకీ ఎలా ఉందంటే!
Recommended Video
ఆట అదుర్స్.. ఏకంగా పాతిక లక్షలు
జూనియర్ ఎన్టీఆర్ హోస్టు చేస్తోన్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో ఫస్ట్ గెస్టుగా వచ్చిన రామ్ చరణ్.. అదిరిపోయే ఆటతో ఆకట్టుకున్నాడని సమాచారం. చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాడని తెలిసింది. అంతేకాదు, ఇందులో అతడు ఏకంగా రూ. 25 లక్షలు గెలుచుకున్నాడని కూడా తెలుస్తోంది. ఈ డబ్బులు మొత్తాన్ని ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది.