Don't Miss!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బుల్లితెరపై మళ్లీ ‘రామాయణం’
భారతీయ టీవీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన 'రామాయణ్' పౌరాణిక సీరియల్ మరోసారి బుల్లితెరపై కనువిందు చేయనుంది. భారతీయ సంస్కృతిలో మమేకమైన శ్రీరామచంద్రుని దివ్యగాథను మరోమారు తెరకెక్కించనున్నట్లు ప్రముఖ టెలివిజన్ ఛానెల్ జీటీవీ ప్రకటించింది.
ఆబాలగోపాలాన్ని అలరించే ఈ సీరియల్ లో ప్రధాన పాత్రల పోషణకు సమర్థులైన నటీనటుల ఎంపికను పరిశీలిస్తున్నట్లుగా తెలిపింది. తాజాగా రామాయణ ను కుటుంబ సభ్యులంతా కలిసి చూడదగిన దృశ్య కావ్యంగా తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమని జీటీవీ కార్యక్రమాల విభాగం అధిపతి సుఖేశ్ మొత్వానీ వివరించారు.
గతంలో 1980లో ప్రముఖ చిత్ర నిర్మాత రామానంద్ సాగర్...సాగర్ ఆర్ట్స్ పేరిట నిర్మించి, దర్శకత్వం వహించిన 'రామాయణ్' మంచి ఆదరణ పొందింది. అన్ని భాషల్లోనూ అనువాదమై సూపర్ అనే పేరు తెచ్చుకుంది. ఇలాంటి సీరియళ్లు మరలా ప్రసారం కావడం వల్ల ఈ జనరేషన్ పిల్లలకు మన పురాణాలు, భారతీయ చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం దక్కుతుందని, జీటీవీ చేపట్టనున్న ఈకార్యక్రమాన్ని అభినందిస్తున్నారు.