Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బుల్లితెరపై మళ్లీ ‘రామాయణం’
భారతీయ టీవీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన 'రామాయణ్' పౌరాణిక సీరియల్ మరోసారి బుల్లితెరపై కనువిందు చేయనుంది. భారతీయ సంస్కృతిలో మమేకమైన శ్రీరామచంద్రుని దివ్యగాథను మరోమారు తెరకెక్కించనున్నట్లు ప్రముఖ టెలివిజన్ ఛానెల్ జీటీవీ ప్రకటించింది.
ఆబాలగోపాలాన్ని అలరించే ఈ సీరియల్ లో ప్రధాన పాత్రల పోషణకు సమర్థులైన నటీనటుల ఎంపికను పరిశీలిస్తున్నట్లుగా తెలిపింది. తాజాగా రామాయణ ను కుటుంబ సభ్యులంతా కలిసి చూడదగిన దృశ్య కావ్యంగా తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమని జీటీవీ కార్యక్రమాల విభాగం అధిపతి సుఖేశ్ మొత్వానీ వివరించారు.
గతంలో 1980లో ప్రముఖ చిత్ర నిర్మాత రామానంద్ సాగర్...సాగర్ ఆర్ట్స్ పేరిట నిర్మించి, దర్శకత్వం వహించిన 'రామాయణ్' మంచి ఆదరణ పొందింది. అన్ని భాషల్లోనూ అనువాదమై సూపర్ అనే పేరు తెచ్చుకుంది. ఇలాంటి సీరియళ్లు మరలా ప్రసారం కావడం వల్ల ఈ జనరేషన్ పిల్లలకు మన పురాణాలు, భారతీయ చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం దక్కుతుందని, జీటీవీ చేపట్టనున్న ఈకార్యక్రమాన్ని అభినందిస్తున్నారు.