Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఒక్కరోజే ఐదుకోట్ల వ్యూయర్షిప్.. రామాయణం సీరియల్కు అదిరిపోయే రెస్పాన్స్!
కరోనా ధాటికి ప్రపంచం మొత్తం విలవిల్లాడుతోంది. విరుగుడే లేని కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వేల మందిని పొట్టనబెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు ఏడు లక్షల మందికి సోకగా.. మన దేశంలో రెండు వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. కరోనాకు విరుగుడు కనిపెట్టలేక పోవడం ఒకెత్తు అయితే.. కట్టడి చేయడంలోనూ విఫలమవుతుండటం బాధాకరమైన అంశం. అయితే మన దేశంలో కరోనా కట్టడిలో భాగంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ను విధించిన సంగతి తెలిసిందే.
21 రోజుల లాక్ డౌన్..
కరోనా బీభత్సానికి ప్రపంచమే అతలాకుతలమైపోతోంది. ఇండియాలోనూ కరోనా తాండవం చేస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు 21 రోజులు (ఏప్రిల్ 14 వరకు) లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ పిలుపు మేరకు ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు.
మళ్లీ పున: ప్రసారం..
లాక్ డౌన్ నేపథ్యంలో రామాయణం ధారావాహికను ప్రసారం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ పాత రోజులను గుర్తు చేసేలా రామాయణం సీరియల్ టెలివిజన్ ప్రసారం చేయనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. పబ్లిక్ డిమాండ్ మేరకు రామాయణాన్ని మళ్లీ ప్రసారం చేస్తున్నామని తెలిపారు.
వారాంతంలో రెండు పూటలు..
రామాయణం టెలివిజన్ విజన్ సీరియల్ను 21 రోజుల లాక్డౌన్ పిరియడ్లో ప్రసారం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత శని, ఆది వారాల్లో రామాయణ్ సీరియల్ ప్రసారంమైంది. ఉదయం, రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమైన ఈ ధారావాహికకను విశేషమైన స్పందన వచ్చింది.
Recommended Video
మొత్తం 8.5కోట్ల మంది..
శనివారం ప్రసారమైన రెండు ఎపిసోడ్స్ను 34 మిలియన్స్ వీక్షించినట్టు బార్క్ లెక్కలు చెబుతున్నాయి. అయితే ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్స్ను దాదాపు 51మిలియన్ల మంది వీక్షించారు. ఇది గత కొన్నేళ్లుగా ఓ ధారావాహికకు వచ్చిన వాటిలో గొప్ప రికార్డ్. ఇలా మొత్తంగా రామయణ్ సీరియల్కు మొదటి వారంలో 85మిలియన్ వ్యూస్ దక్కాయని తెలుస్తోంది.