Don't Miss!
- Lifestyle ప్రేమ విషయంలో ఈ రాశులను మాత్రం అస్సలు నమ్మకూడదు..నమ్మక ద్రోహం చేస్తారు..
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రామ్ చరణ్, రంభ..మధ్యలో చిరంజీవి , అదిరిందంతే
చిరంజీవి హోస్ట్ గా మొదలైన షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’కు గెస్ట్ గా రామ్ చరణ్ , రంభ వచ్చారు.
హైదరాబాద్ : మళ్లీ మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఫాంలో కి వచ్చేసారు. ఓ ప్రక్క వి వి వినాయిక్ దర్శకత్వంలో తన 150వ సినిమాను శరవేగంగా పూర్తి చేసి సూపర్ హిట్ కొట్టిన చిరంజీవి తన సురేంద్రరెడ్డి దర్సకత్వంలో 151 చిత్రానికి రెడీ అవుతున్నారు, అదే సమయంలో చేసిన టీవి తెరంగ్రేటం కు కూడా మంచి స్పందన వస్తోంది. తెలుగు టెలివిజన్ రంగంలో సంచలనం సృష్టించిన మీలో ఎవరు కోటీశ్వరుడు నాలుగో సీజన్ కు చిరంజీవి వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ దుమ్ము రేపుతున్నారు.
గత మూడు సీజన్లలో వ్యాఖ్యతగా స్టార్ హీరో నాగార్జున వ్యవహరించగా ఈ నాలగో సీజన్లో మాత్రం ఆ బాధ్యతను మెగాస్టార్ తీసుకున్నాడు. మా టివీలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమం క్రేజ్ తో కూడిన గెస్ట్ లతో ఆసక్తి రేపుతోంది. తాజాగా ఈ షో కు వచ్చిన గెస్ట్ లు హాట్ టాపిక్ గా మారారు. ఎవరా గెస్ట్ లు అంటే...
'కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టినవాడు మీతో కోటి గెలిపించేందుకు వస్తున్నాడు' అంటూ మెగాస్టార్ నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చింది రంభ. అయితే ఆ క్రేజ్ ని రెట్టింపు చేయటానికి ఎవరితో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చిందో తెలుసా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఎంఈకేలో పాల్గొంది రంభ.
ఈ ఎపిసోడ్ కి సంబంధించిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ మెగాభిమానులను పండగ చేసుకునేలా చేస్తోంది. ముఖ్యంగా మాస్ రగ్గడ్ లుక్ లో రామ్ చరణ్.. లేట్ ఫార్టీస్ లోనూ వయస్సు సగానికి తగ్గినట్లు కనపడుతున్న రంభ... హోస్ట్ గా సూపర్ స్టైల్ గా చిరంజీవి.. ఈ కాంబో చూస్తూంటే సినిమా చేస్తే బాగుండును అనిపిస్తోంది కదూ.
ఇదిలా ఉంటే...'ఖైదీ నెంబర్ 150'తో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఎంఈకే షోకు రెస్పాన్స్ అదిరిపోతుందని టీవి ఛానెల్ వాళ్లే కాకుండా సామాన్య ప్రేక్షకులు కూడా భావించారు. దానికి తోడు ..ఈ షో ఆరంభంలోనే నాగార్జున గెస్ట్ గా విచ్చేశాడు. ఒక పార్టిసిపెంట్ కోటి రూపాయల ప్రశ్న వరకు వెళ్లాడు. అయినా ఈ ప్రోగ్రాంకు ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రాలేదనే విషయం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది.
ఈ షో ప్రసారమైన వారంలో టీఆర్పీ రేటింగ్స్ లిస్టులోనూ 'ఎంఈకే'కు టాప్ ప్లేస్ లో ఉంటుందనుకుంటే అలాంటిదేమీ దక్కలేదు. అసలు టాప్-5లోనే ఎంఈకే లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమైంది. బార్క్ రేటింగ్స్ ప్రకారం గత వారం 'జనతా గ్యారేజ్' ప్రిమియర్ షో అగ్రస్థానంలో ఉంటే.. తర్వాతి నాలుగు స్థానాల్ని టీవీ సీరియల్స్ దక్కించుకుని అందరికీ షాక్ ఇచ్చాయి.