Don't Miss!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కరోనాతో అభిమాని మృతితో షాక్లో బిగ్బాస్ సెలబ్రిటీ.. మరణానికి ముందు ఒకవేళ నేను చనిపోతే అంటూ..
సినీ నటి, బిగ్బాస్ రియాలిటీ షో సీజన్ 13 ఫైనలిస్టు రషామీ దేశాయ్ విషాదంలో మునిగిపోయారు. కరోనావైరస్ కారణంగా తన అభిమాని చనిపోవడంతో బాధలో మునిగిపోయారు. తన అభిమాని మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలుగాలంటూ ప్రార్థించారు. అంతేకాకుండా ప్రతీ ఒక్కరు ఆయన ఆత్మకు శాంతి కలిగేలా భగవంతుడిని వేడుకోవాలంటూ సూచించారు. అభిమాని మరణం గురించి ఆమె వెల్లడిస్తూ..
బిగ్బాస్ సెలబ్రిటీ రషామీ దేశాయ్ అంటే
రషామీ దేశాయ్ని పిచ్చిగా ఇష్టపడే ఓ అభిమాని ఆమె పేరిట రషామీ కి ఫ్యాన్ అనే అకౌంట్ను ట్విట్టర్లో తెరిచారు. ఆ ట్విట్టర్ అకౌంట్ ద్వారా రషామీ గురించి ఎంత ఇష్టపడుతాననే విషయాన్ని క్రమం తప్పకుండా వెళ్లడిస్తారు. అలాగే ఆమె ఫోటోలను, ఆమెకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాడు. కానీ తన పేరు ఎప్పుడూ కూడా వెల్లడించకపోవడం గమనార్హం. చివరి వరకు అజ్ఞాత అభిమానిగానే మిగిలిపోవడం విషాదంగా మారింది.
నేను కరోనా నుంచి బయటపడకపోతే
ఇటీవల రషామీ ఫ్యాన్ తన ట్విట్టర్లో షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. నాకు కోవిడ్ 19 పాజిటివ్ అనే విషయం వైద్య నిర్ధారణ పరీక్షల్లో బయటపడింది. ఒకవేళ నేను ఈ వ్యాధి నుంచి బయటపడకపోయినట్లయితే.. నాకు జరగకూడనిది ఎదైనా జరిగితే దయచేసి మీరు నన్ను ఎప్పుడూ గుర్తుంచుకోండి. నేను రషామీ దేశాయ్ కోసమే ట్విట్టర్లో జాయిన్ అయ్యాను. నేను ఎప్పటికీ రషామీ ఫ్యాన్గానే మిగిలిపోతాను. మీ నుంచి నెగిటివిటీని దూరం చేయండి అంటూ ఇటీవల ట్వీట్ చేశారు. అయితే ఊహించని విధంగా అభిమాని కరోనా వ్యాధితో మరణించడం విషాదంగా మారింది.
అభిమాని మరణంతో షాక్లో
తన అభిమాని మరణించడంతో విషాదంలో మునిగిపోయిన రషామీ దేశాయ్ ట్విట్టర్లో స్పందిస్తూ.. జీవితం ఓ వింత. జీవితం చాలా కఠినమైనది. పారదర్శకమైంది కానే కాదు. నా అభిమాని మరణంతో చాలా విషాదంలో మునిగిపోయాను. గుండె పగిలినంత బాధ పడుతున్నాను. నా అభిమాని మరణంతో విషాదంలో మునిగిపోయిన తన కుటంబానికి నా ప్రగాఢ సంతాపం. నన్ను ఎంతగానో ప్రేమించే వ్యక్తిని కోల్పోయాను. ఆయన ఆత్మకు శాంతి కలుగాలి అని రషామీ దేశాయ్ ట్వీట్లో పేర్కొన్నారు.
కరోనాకు దూరం కావాలి..
కరోనా ప్రాణాంతక వ్యాధి మరొకరి ప్రాణాలను మన నుంచి దూరం తీసుకెళ్లవద్దని ఆశిద్దాం. ప్రపంచాన్ని ఈ వ్యాధి దారుణంగా అతలాకుతలం చేస్తున్నది. ప్రపంచంలోని ప్రతీ ఒక్కరు ఈ వ్యాధి నుంచి త్వరగా బయటపడాలని ప్రార్థిస్తాం అంటూ రషామీ దేశాయ్ ట్వీట్లో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.