Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అతడ్ని కూడా అలాగే తన్నాలి.. కర్మ అనేదొకటి ఉంటుంది.. వీడియోపై రష్మీ ఫైర్
సాటి మనిషిపై జాలి చూపే వారు కొందరైతే.. మూగజీవాల పట్ల ప్రేమను చూపే వారు మరికొందరు. ఇలాంటి వారు మరింత సున్నిత వ్యక్తిత్వంతో ఉంటారు. మూగజీవాల పట్ల ప్రేమను కురిపిస్తూ.. వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు. వాటిని అపురూపంగా పెంచుకుంటూ ఉంటారు. మూగజీవులను రక్షించడంలో టాలీవుడ్ సెలెబ్రిటీల్లో ఎంతో మంది ముందుకు వస్తుంటారు.
అమల, ఉపాసన, రామ్ చరణ్ వంటి వారికి మూగజీవాలపై అమిత ప్రేమ ఉంటుంది. జబర్దస్త్ యాంకర్ రష్మీకి సైతం మూగజీవాలంటే మక్కువ.కరోనా వైరస్తో మానవాళి మొత్తం అతలాకుతలం అవుతూ ఉంటే.. మూగజీవాలను పట్టించుకునేవారు కరువయ్యారు. ఇలాంటి విపత్కర తరుణంలోనూ మూగజీవాల కోసం పాటు పడుతోంది రష్మీ. తాజాగా ఆమె ఓ నెటిజన్పై మండిపడింది. ఆమె ఆగ్రహానికి కారణం ఏంటో ఓ సారి చూద్దాం.
మూగ జీవాలకు ఆహారం..
కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందడంతో దాన్నికట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించారు. దీంతో ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. కొన్ని చోట్ల మనుషులకు కూడా తినడానికి తిండిలేని పరిస్థితి ఏర్పడింది. మనుషుల పరిస్థితే ఇలా ఉందంటే.. ఇక మూగ జీవాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వీటికి ఆహారాన్ని అందించేందుకు జబర్దస్త్ యాంకర్ రష్మీ ముందుకు వచ్చింది.
బకెట్ పట్టుకుని రోడ్లపైకి..
మూగ జీవాలకు తిండి దొరకడం లేదని గ్రహించిన రష్మీ స్వయంగా రోడ్లపైకి ఎక్కింది. చేతిలో బకెట్ పట్టుకుని వీధి కుక్కలకు ఆహారాన్ని పెట్టసాగింది. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. రష్మీ చేసిన మంచి పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపించారు. రష్మీ ఇలా మూగజీవాల కోసం పాటు పడుతూ ఉంటే వాటిని అనవసరంగా కొట్టి చంపి మానసిక ఆనందాన్ని పొందే వారు కూడా ఉన్నారు.
|
కుక్కను కాలితో తన్నడంతో..
ముంబైలోని మీరా రోడ్లో ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు.. అతనికి సమీపంలో ఓ కుక్క రావడం.. ఫోన్లో మాట్లాడుకుంటూనే దాన్ని కాలితో తన్నాడు.. అమాంతం ఎగిరి అవతల పడింది ఆ కుక్క. ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ బాలీవుడ్ సెలెబ్రిటీలతో పాటు రష్మీకి కూడా ట్యాగ్ చేశాడు.
Recommended Video
కర్మ అనేదొకటి ఉంది..
సదరు వీడియో స్పందించిన రష్మీ.. ‘అతనికి ఏమైంది.. ఆ కుక్క అతనికి ఎలాంటి హాని చేయడానికి కూడా వెళ్లలేదు.. అయినా ఎందుకలా చేశాడు.. అతన్ని, అతను బాగా ప్రేమించేవారిని కూడా అలాగే తన్నాలి.. కర్మ అనేది ఒకటి ఉంది.. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన చట్టాలు చేయాల'ని ట్వీట్ చేసింది.