Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సుధీర్ను మరిచిపోయిన రష్మీ.. శేఖర్ మాస్టర్ను మాత్రం టార్గెట్ చేసిన యాంకర్
బుల్లితెరపై ఎన్నో సంచలనాలు నమోదు చేసింది జబర్దస్త్ షో. ఈ షో ఎంతగా ఫేమస్ అయిందో.. రష్మీ-సుడిగాలి సుధీర్ జంట కూడా అంతే పాపులర్ అయింది. ఈవెంట్లో భాగంగా వీరిద్దరి పెళ్లికి కూడా ఎంతో ఘనంగా జరిగింది. ఆ వేడుకను చూస్తే నిజంగా పెళ్లైతే కూడా అంత బాగా జరగదనిపించేలా కనువిందు చేసింది. బుల్లితెరపై వీరిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టుగా మరేజంటది కాలేదు. తాజాగా రష్మీ సుధీర్ను ఓ విషయంలో మరిచిపోయినట్లు కనిపిస్తోంది. ఏంటా విషయమనేది ఓ సారి చూద్దాం.
ఎంపీ సంతోష్ మొదలు పెట్టిన కార్యక్రమం..
ఎంపీ సంతోష్ తెలంగాణలో మొదలు పెట్టిన 'గ్రీన్ ఇండియా చాలెంజ్' విస్తరిస్తూనే ఉంది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు పాల్గొని, ఒక్కొక్కరు మూడు మొక్కలు చొప్పున నాటుతూ.. మరో ముగ్గురికి మొక్కలు నాటాలని చాలెంజ్ విసురుతున్నారు.
దీనికి కొనసాగింపుగా రోజా వనం..
ఈ చాలెంజ్ను స్ఫూర్తిగా తీసుకున్న రోజా తన పేరిట 'రోజా వనం' అనే చాలెంజ్ ప్రారంభించింది. దీనిలో భాగంగా ప్రముఖులకు గ్రీన్ ఇండియ ఛాలెంజ్ విసిరి వారితో మొక్కలు నాటిస్తున్నారు. మొదటగా రోజా మొక్కలు నాటి యాక్షన్ కింగ్ అర్జున్, నటి కుష్బూలకు చాలెంజ్ విసిరింది.
స్వీకరించిన సెలెబ్రిటీలు..
రోజా విసిరిన ఆ చాలెంజ్ను అర్జున్, ఖుబ్బూలు స్వీకరించారు. రోజా వనంలో మొక్కలు నాటారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా యాంకర్ రష్మి కూడా రోజా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు స్పందించింది.
Recommended Video
సుధీర్ను మరిచిపోయిన రష్మీ..
రష్మీ.. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా నానక్రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో మొక్కలు నాటింది. అనంతరం మాట్లాడుతూ.. రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతను, వాతావరణంలో హెచ్చుతగ్గులను సమతుల్యత చేయడానికి మొక్కలు తప్పకుండా పెంచాలని పేర్కొంది. హీరో సత్యదేవ్, ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, ప్రముఖ యాంకర్ అనసూయకు తన తరుపున చాలెంజ్ విసిరింది. అయితే వీరిలో సుధీర్కు మాత్రం చాలెంజ్ విసరలేదు.