Don't Miss!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- News రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
బిగ్ బాస్ నుంచి రోహిణి ఔట్.. చిన్న పొరపాటుతో ఎలిమినేట్.. కారణం తానేనంటూ కొట్టుకుని ఏడుస్తూ..
Recommended Video
'బిగ్ బాస్' రియాలిటీ షో .. తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన షోలలో ఒకటి. కొందరు సెలెబ్రిటీలను ఓ ఇంట్లోకి పంపించడం.. హౌస్మేట్స్తో కలిసి కొన్ని రోజులు ట్రావెల్ చేయడం.. కుట్రలు కుతంత్రాలు తట్టుకుని నిలబడడం.. చివరకు ఇంట్లోని వారితో పాటు ప్రేక్షకుల హృదయాలను గెలిచిన ఒకరిని విజేతగా ప్రకటించడం.. ఇదీ బిగ్ బాస్ ప్రాసెస్. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ప్రస్తుతం మూడో సీజన్ కొనసాగుతోంది. ఈ వారం షో నుంచి ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. అది కూడా చిన్న పొరపాటు వల్ల. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఏడుగురు నామినేట్
గత వారం ఎలిమినేషన్కు రాహుల్, శివజ్యోతి, శ్రీముఖి, రవి, రోహిణి, వరుణ్, బాబా భాస్కర్లు నామినేట్ అయిన విషయం తెలిసిందే. వీరిలో శివజ్యోతి, వరుణ్ను శనివారమే సేఫ్ అయినట్లు ప్రకటించిన నాగార్జున.. ఆదివారం బాబా భాస్కర్, శ్రీముఖి, రవి, రాహుల్ సేఫ్ అయినట్లు హౌస్లో ఉన్న ఎన్వలప్ కవర్లలో ఉన్న పేర్లను హౌస్మేట్స్ చదవి వాళ్లు సేఫ్ అయినట్లు వెల్లడించారు. దీంతో రోహిణి ఎలిమినేట్ అయిపోయింది.
కొట్టుకుంటూ ఏడ్చిన శివజ్యోతి
రోహిణి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించగానే కంటెస్టెంట్లు అందరూ షాక్కు గురయ్యారు. అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అయితే, శివజ్యోతి మాత్రం ఏడుపు మొదలు పెట్టేసింది. ఆమెను ఓదార్చడానికి కంటెస్టెంట్లు అందరూ రావడంతో ఉద్వేగభరిత వాతావరణం కనిపించింది. ఒకానొక సందర్భంలో శివజ్యోతి తన చెంపపై తానే కొట్టుకుని నా వల్లే రోహిణి ఎలిమినేట్ అయిందని ఏడవడం కనిపించింది.
ఆ పొరపాటు వల్లే..
గత సోమవారం నామినేషన్ ప్రక్రియ జరిగే సమయంలో రోహిణి, శివజ్యోతి చేసిన పొరపాటే ఈ వారం ఎలిమినేషన్కు కారణమైంది. వాళ్లిద్దరూ కన్ఫెషన్ రూమ్కు వెళ్లొచ్చిన తర్వాత నామినేషన్స్ గురించి ఒకరితో ఒకరి సంభాషించకూడదని బిగ్ బాస్ పదే పదే హెచ్చరిస్తున్నా.. శివజ్యోతి, రోహిణిలు పట్టించుకోకుండా గుసగుసలాడటంతో బిగ్ బాస్ ఈ ఇద్దర్నీ హెచ్చరిస్తూ శిక్షవిధించారు. శివజ్యోతి నాలుగోవారం అప్పటికే నామినేట్ కావడంతో రోహిణిని డైరెక్ట్గా నామినేట్ చేశారు. ఈవారానికి కాకుండా.. వచ్చే వారానికి కూడా ఇద్దర్నీ డైరెక్ట్గా నామినేట్ చేసి షాక్ ఇచ్చారు బిగ్ బాస్.
రాహుల్ వెళ్తాడనుకున్నారు
ఈ వారం ఎలిమినేషన్ జోన్లో ఉన్న వారిలో రాహుల్ సింప్లీగంజ్ ఒక్కడే హాట్ టాపిక్ అయ్యాడు. శ్రీముఖితో గొడవ పడిన తీరు, కెప్టెన్సీ టాస్క్లో అవతలి టీమ్కు సహాయం చేయడం, బజర్ మోగిన సమయంలో సింహాసనంపై కూర్చోకుండా సిగరెట్ కాల్చుతూ కనిపించడం, పునర్నవితో పులిహోర కలపడం వంటి వాటితో ఈ సారి బయటకు వెళ్లేంది రాహుల్ అని ప్రచారం జరిగింది. కానీ, రాహుల్ మాత్రం సేఫ్ అవడం విశేషం.
12 మందే మిగిలారు
నాలుగో వారం ఎలిమినేట్ కావడంతో ఇక హౌస్లో 12 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. బాబా భాస్కర్, శ్రీముఖి, రవి, రాహుల్, పునర్నవి, వితిక, వరుణ్, హిమజ, అలీ, మహేశ్ విట్టా, అషు రెడ్డి, శివజ్యోతి హౌస్లో కొనసాగుతుండగా.. ఇప్పటికే హేమ, జాఫర్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన తమన్నా సింహాద్రి, తాజాగా రోహిణి ఎలిమినేట్ అయ్యారు. ఇక, ఈ వారం ఎవరు నామినేట్ అవుతారు..? ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్తారు? అనేది చూడాలి.