Don't Miss!
- Sports మా భారత క్రికెటర్లకు ఇంకా ఆ గతి పట్టలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- News సూర్య గోచారంతో మే 13వరకు ఈ రాశులకు సంపద వర్షం
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాత్రూమ్కు వెళ్లినా వదిలేది కాదు.. అలా చేస్తుందని ఊహించలేదు: తమన్నాపై రోహిణి కామెంట్స్
Recommended Video
'బిగ్ బాస్' సీజన్ - 3 మొదటి వారం ఎలిమినేషన్ తర్వాత ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి ఎంటరైన విషయం తెలిసిందే. మొదటి రోజు ఇంటిలోకి అడుగు పెడుతూనే 'పిక్చర్ ఔర్ బాకీ హై దోస్త్' అని డైలాగ్ చెప్పిన ఆమె.. అదే రీతిలో వ్యవహారాలు నడిపింది. ఆ తర్వాత ఎందరితోనే గొడవలు పెట్టుకున్న తమన్నా.. రవి కృష్ణ విషయంలో చేసిన పనులకు హౌస్మేట్స్తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా అవాక్కయ్యారు. తాజాగా ఇదే విషయాలపై షో నుంచి ఎలిమినేట్ అయిన రోహిణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
ఇంట్లోకి వచ్చిన వెంటనే తమన్నా ఇలా చెప్పింది
వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించిన వెంటనే తమన్నా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘ఆమె ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత అందరం కూర్చుని మాట్లాడాం. అప్పుడు తన కష్ట సుఖాలను మా అందరితో పంచుకుంది. అదే సమయంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అప్పుడు మేమంతా ఆమెకు ధైర్యం చెప్పాం. దీంతో ఆమె కొంత కుదుట పడింది' అని రోహిణి చెప్పుకొచ్చింది.
నామినేట్ చేయొద్దని బ్రతిమాలింది
తమన్నా ఎంటరైన వారంలో ఆమెను ఎవరూ నామినేట్ చేయొద్దని బిగ్ బాస్ చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి వారం నామినేషన్ ప్రక్రియ మొదలయ్యే ముందు తమన్నా ఇంట్లోని అందరితో మాట్లాడిందని రోహిణి తెలిపింది. ‘తమన్నా ఇంట్లోని ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి నన్ను నామినేట్ చేయకండి అని బ్రతిమాలింది. నేను అందరికీ ఆదర్శంగా నిలవాలని అనుకుంటున్నాను. నాకు అవకాశం ఇవ్వండి అని కోరింది' అని రోహిణి వెల్లడించింది.
రవిని మాత్రం అలా చేస్తుందనుకోలేదు
తమన్నా ఇంటి నుంచి బయటకు రావడానికి కారణమైన రవి కృష్ణ వ్యవహారంపైనా రోహిణి స్పందించింది. ‘ఆ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో నాతో పాటు చాలా మంది తమన్నాకు వ్యతిరేకంగా ఓటు వేశాం. అయితే, అందరితో మంచిగానే ఉన్న ఆమె.. రవి కృష్ణ విషయంలో మాత్రం దారుణంగా ప్రవర్తించింది. అప్పటి వరకు పండు, పండు అని పిలిచిన తమన్నా.. అలా ప్రవర్తిస్తుందని అస్సలు ఊహించలేదు' అని రోహిణి పేర్కొంది.
బాత్రూమ్కు వెళ్లినా వదిలేది కాదు
రవి కృష్ణను తమన్నా టార్చర్ చేసిందని చెప్పిన రోహిణి.. ‘కేవలం నామినేట్ చేశాడనే కారణం చెప్పి అతడితో చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించింది. పప్పు పప్పు అంటూ ఏడిపించింది. పైగా రవి వాళ్ల అమ్మానాన్నకు మెసేజ్ కూడా ఇచ్చింది. అంతేకాదు, రవి బాత్రూమ్కు వెళ్లినా వెనకనే వెళ్లేది. దీంతో అతడు చాలా బాధ పడేవాడు. ఈ విషయంలో నన్ను కూడా ఎన్నో మాటలు అంది' అని ఆమె వివరించింది.
రవికి నేనంటే ప్రేమ
అయితే, రవితో జరిగిన గొడవపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్నా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘గొడవ జరిగిన తర్వాత.. నేను బయటకు వచ్చే వరకు నీతో మాట్లాడాలి అని రవి చాలా సార్లు అన్నాడు. ప్రేమలో అలకలు ఉంటాయి కాబట్టి నేను మాట్లాడలేదు. నా బాధ తనకు తెలియాలి కదా. ప్రేమ లేకుండానే రవి నాతో మాట్లాడాలి అని అడిగాడా..?' అంటూ తమన్నా పేర్కొనడం విశేషం.