అందరి ముందే భార్యాభర్తల ఘాటు రొమాన్స్.. చాలు అన్న వినకుండా.. ఇంట్లో ఛాన్స్ దొరకలేదా అంటూ!
బుల్లితెర ప్రేక్షకులకు విపరీతంగా ఎంటర్టైన్ మెంట్ ఇచ్చేవాటిలో ముందుగా సీరియల్స్ ఉంటాయి. తర్వాత రియాలిటీ, డ్యాన్, టాక్, సింగింగ్ షోలపై మొగ్గు చూపుతుంటారు ఆడియెన్స్. అయితే సీరియల్ నటీనటులు, రియల్ లైఫ్ కపుల్స్ జోడీలుగా అదిరిపోయే స్టెప్పులతో అట్రాక్ట్ చేస్తే.. అదే 'నీతోనే డ్యాన్స్' (Neethone Dance)షో. ఇటీవలే ప్రారంభమైన ఈ డ్యాన్స్ షోలో బుల్లితెర నటీనటులు జంటలుగా ఆకట్టుకుంటున్నారు. ఇక ఇందులో పాల్గొన్న ఓ రియల్ లైఫ్ కపుల్ అందరి ముందే రెచ్చిపోయి రొమాన్స్ పండించారు.
ఎక్కువగా డ్యాన్స్ షోలు:బుల్లితెరపై రియాలిటీ డ్యాన్స్ షోలు ఎక్కువైపోయాయి. ఇటీవలే ఢీ 15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ ముగిసింది. అలాగే బిగ్ బాస్ తర్వాత ప్రవేశపెట్టిన బీబీ జోడీ డ్యాన్స్ షో కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఢీ షోలో న్యూ టాలెంటెడ్ డ్యాన్సర్స్, కొరియోగ్రాఫర్స్ పర్ఫామెన్స్ ఇస్తే బీబీ జోడీలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అదిరిపోయే స్టెప్పులతో ఆకర్షించారు. ఇప్పుడు బుల్లితెరపై సరికొత్తగా వచ్చింది 'నీతోనే డ్యాన్స్'.
8 జోడీలు:స్టార్ మా వేదికగా 'నీతోనే డ్యాన్స్' అంటూ ప్రారంభం అయిన ఈ డ్యాన్స్ షోలో ఒకరిని మరొకరు ఢీకొట్టేందుకు జంటలుగా వచ్చారు. ఈ జంటల్లో కొందరు రియల్ లైఫ్ కపుల్స్ ఉంటే మరికొందరు రీల్ పెయిర్స్ ఉన్నారు. ఈ నీతోనే డ్యాన్స్ షోలో మొత్తంగా 8 జంటలు పాల్గొంటున్నాయి. ఇందులో ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న అమర్ దీప్-తేజస్విని, నిఖిల్-కావ్య, శివ కుమార్-ప్రియాంక, నటరాజ్-నీతూ, సందీప్-జ్యోతి రాజ్, యాదమ్మ రాజు-స్టెల్లా, సాగర్-దీప, పవన్-అంజలి జోడీలుగా ఉన్నారు.

మళ్లీ వాళ్లే:నీతోనే డ్యాన్స్ షోకి న్యాయ నిర్ణేతలుగా అలనాటి స్టార్ హీరోయిన్ రాధతోపాటు గ్లామరస్ హీరోయిన్ సదా, ప్రముఖ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురు ఇదివరకు బీబీ జోడీ డ్యాన్స్ షోకి సైతం జడ్జెస్ గా ఉన్నారు. ఇక ఈ షోకి యాంకర్ గా చేసిన బుల్లితెర రాములమ్మ శ్రీముఖి కూడా 'నీతోనే డ్యాన్స్' షోకి హోస్ట్ గా ఆకట్టుకుంటోంది.

లేక లేక వచ్చింది:ఇటీవల నీతోనే డ్యాన్స్ ప్రోమో విడుదల చేశారు. ఇందులో జంటలు రెచ్చిపోతూ రొమాన్స్ పండిస్తున్నారు. వారికి హాట్ పర్ఫామెన్స్ కు జడ్జెస్ సైతం ఊగిపోతున్నారు. యాదమ్మ రాజు-స్టెల్లాతో మిమ్మల్ని లవ్ చేయమన్నారయ్యా బాబు అని తరుణ్ మాస్టర్ అన్నారు. దీంతో మాస్టర్ లేక లేక కొంచెం రొమాన్స్ వచ్చింది అని స్టెల్లా ఆన్సర్ ఇచ్చింది.

ఛాన్స్ దొరకలేదా?:అనంతరం అమర్ దీప్-తేజస్విని మధురమే సాంగ్ కు ఘాటు రొమాన్స్ చేశారు. దుప్పట్లో దూరి మరి చేయడంతో కళ్లు మూసుకుని చాలు చాలు అని రాధ అన్నారు. "చాలా కంఫర్ట్ బుల్ గా ఉన్నారు మీరిద్దరు. ఎందుకు. మీకు ఇంట్లో ఇదంతా చేయడానికి అవకాశం దొరకలేదా?" అని సదా అడిగారు. దీంతో వాళ్లు నో అని చెప్పి తర్వాత విషయం అర్థమై సిగ్గుపడిపోయారు. "ఇదంతా నా వల్ల కాదు. నేను చాలా అన్ రొమాంటిక్ పర్సన్" అని సదా అన్నారు.


Click it and Unblock the Notifications











