Just In
Don't Miss!
- News
నిమ్మగడ్డ సంచలనం: ఇద్దరు కలెక్టర్లు సహా 9మందిపై వేటుకు ఆదేశం -ఎన్నికలకు అడ్డొస్తే అంతే!
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Sports
ఆ రెండు జట్లు సంజూ శాంసన్ ఇవ్వమన్నాయి.. అందుకే రాజస్థాన్ అలా చేసింది!
- Finance
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ.7 కోట్లు టోకరా వేసిన కేటుగాడిపై ఈడీ కేసు, ఆ సంస్థ ఆస్తులు అటా
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
న్యూ ఇయిర్ స్పెషల్: నాగ్,సమంత కలిసి..(వీడియో)
హైదరాబాద్ :నాగార్జున,సమంత కలిసి గతంలో మనం చిత్రం చేసారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ రియాలిటీ షోలో పాల్గొననున్నారు. అది మరేదో కాదు...మీలో ఎవరు కోటీశ్వరుడు. ఈ రోజు(డిసెంబర్ 31) రాత్రి 11 గంటలకు మా టీవిలో ప్రసారమయ్యే ఎపిసోడ్ లో న్యూ ఇయిర్ స్పెషల్ గా సమంత పాల్గొని అలరించనుంది. ఈ మేరకు టీజీర్ ని సైతం విడుదల చేసారు. ఆ టీజర్ ని మీరు చూడండి...
అక్కినేని నాగార్జున బుల్లితెరపైకి అరంగేట్రం చేస్తూ చేసిన రియాలిటీ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ షో హిందీలో బాగా ఫేమస్ అయిన కౌన్ బనేగా కరోడ్పతి షోకి రీమేక్ వెర్షన్. ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ద్వారా నాగార్జున తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కావడమే కాకుండా టిఆర్పి రేటింగ్స్ లో రికార్డ్ రేటింగ్స్ సాధించింది.
నాగార్జున హోస్టుగా మా టీవీలో అత్యధిక టీఆర్పీ రేటింగ్లతో దూసుకుపోతున్న షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' . ఇప్పుడు సెకండ్ సెషన్ ప్రారంభమయ్యింది. డిసెంబర్ 8 నుంచి ప్రారంభం మయిన ఈ షోలో హీరో నితిన్ అతిధిగా వచ్చారు. ఫస్ట్ సెషన్ మధ్య మధ్యలో పలువురు స్టార్స్ వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. అలాగే రెండో సీజన్లో కూడా ఈ పద్ధతిని కొనసాగిస్తున్నారు.

ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ప్రఖ్యాత కన్సల్టింగ్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్(ఈ అండ్ వై) పర్యవేక్షణలో ఎంట్రీలను ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత దశగా 1500 మంది నుంచి 100 పోటీదారులను ఎన్నుకున్నట్లు మాటీవీ తెలిపింది. ఈ షోలో నాగార్జున అడిగే 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం ద్వారా కంటెస్టెట్ కోటి రూపాయలు గెలుచుకోవచ్చు.