twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది

    |

    తెలుగు బుల్లితెరపై ఎన్నో షోలు పుట్టుకొస్తుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణను అందుకుంటాయి. అలాంటి షోలలో 'జబర్ధస్త్' ఒకటి. దాదాపు ఎనిమిదేళ్లుగా ఇది టెలివిజన్ రంగంలో తన హవాను చూపిస్తోంది. మధ్యలో దీనికి పోటీగా ఎన్నో షోలు ప్రారంభం అయినా.. అవన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. అయితే, మెగా బ్రదర్ నాగబాబు సారథ్యంలో మొదలైన 'అదిరింది' మాత్రం సూపర్ సక్సెస్ అయింది. ఈ కారణంగానే సీజన్ల మీద సీజన్లు కంప్లీట్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా హాట్ యాంకర్ సమీరా ఈ షో గుట్టురట్టు చేసింది. ఆ వివరాలు మీకోసం!

    ప్రభాస్ - రాకీ భాయ్: Salaar Movie Pooja & Launch Photos

    అలా మొదలైన అదిరింది.. ఆయన రాకతో

    అలా మొదలైన అదిరింది.. ఆయన రాకతో

    తెలుగులో సక్సెస్‌ఫుల్ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. ఆ షో విజయంలో ప్రధాన భూమికను పోషించారు డైరెక్టర్లు నితిన్, భరత్. చాలా కాలం పాటు ఆ షో కోసం పని చేసిన వాళ్లిద్దరూ కొద్ది రోజుల క్రితం దానికి గుడ్‌బై చెప్పేసి, జీ తెలుగులో 'అదిరింది' అనే షోను ప్రారంభించారు. దీనికి మెగా బ్రదర్ నాగబాబు కూడా కలిశారు. దీంతో ఈ షో అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది.

    వాళ్లంతా ఇందులోకి... షోకు పెరిగిన క్రేజ్

    వాళ్లంతా ఇందులోకి... షోకు పెరిగిన క్రేజ్

    జబర్ధస్త్‌లో కీలకంగా వ్యవహరించిన డైరెక్టర్లతో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా అదిరిందిలోకి వచ్చారు. వీరితో పాటు టీమ్ లీడర్లు చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ, వేణు, ధన్‌రాజ్ సహా పలువురు ఆర్టిస్టులు అదిరింది షోలోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడి కంటే ఇక్కడ ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఈ కారణంగానే చాలా మంది ఇందులోకి రావడానికి చూస్తున్నారని అన్నారు.

    సీజన్ల వారీగా అదిరింది... యాడ్ చేశారు

    సీజన్ల వారీగా అదిరింది... యాడ్ చేశారు

    'అదిరింది' అనే పేరుతో ఈ షో ప్రారంభం అయింది. అయితే, జబర్ధస్త్‌లా దీన్ని ఒకే రీతిలో కంటిన్యూ చేయలేదు. మొదట్లో ఒక యాంకర్‌ను, కొంత మంది టీమ్ లీడర్లను పెట్టిన షో నిర్వహకులు.. ఆ తర్వాత థీమ్‌తో పాటు చాలా మార్పులే చేశారు. ఇందులో భాగంగానే 'అదిరింది' తర్వాత 'బొమ్మ అదిరింది' పేరిట మరో సీజన్ ప్రారంభించారు. దీనికి జడ్జ్‌లు కూడా మారిపోయారు.

    పది ఎపిసోడ్స్‌కే ఆమెను పక్కన పెట్టేశారు

    పది ఎపిసోడ్స్‌కే ఆమెను పక్కన పెట్టేశారు

    జబర్ధస్త్‌కు పోటీగా మొదలైన 'అదిరింది' షోలో యాంకర్ బాధ్యతలు నిర్వర్తించిన టీవీ సీరియల్ హీరోయిన్ సమీరా షరీఫ్‌ను పక్కన పెట్టేసిన విషయం తెలిసిందే. కేవలం పది ఎపిసోడ్లకే నిర్వహకులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. అంతేకాదు, అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద దుమారాన్నే రేపింది. దీనిపై ఎన్నో ఊహాగానాలు కూడా ప్రచారం అయ్యాయి.

    అప్పుడే సీక్రెట్ రివీల్ చేసిన సమీరా షరీఫ్

    అప్పుడే సీక్రెట్ రివీల్ చేసిన సమీరా షరీఫ్

    'అదిరింది' షో నుంచి తప్పుకోవడం.. అదే సమయంలో తనపై వస్తున్న వార్తలు చూసిన సమీరా.. ఈ వ్యవహారంపై స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో 'నేను షో నుంచి తప్పుకోలేదు. నాతో 26 ఎపిసోడ్స్‌కు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇప్పుడు వాళ్లే నన్ను తీసేశారు. ఆ విషయం కూడా నాకు డైరెక్టుగా చెప్పలేదు' అని పేర్కొంది.

    ‘అదిరింది' షో గుట్టురట్టు చేసిన యాంకర్

    ‘అదిరింది' షో గుట్టురట్టు చేసిన యాంకర్

    తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమీరా.. అదిరింది షో గురించి మాట్లాడింది. 'ఆ షో నుంచి నన్ను ఎందుకు తీసేశారో ఇప్పటికీ తెలీదు. అస్సలు అది క్లిక్ అవలేదు. అందుకే మార్పులు చేయాలని భావించారేమో. ఇందులో భాగంగానే నన్ను తీసేశారేమో అని అనుకున్నా. ఆ తర్వాత కూడా మార్పులు చేశారు. కానీ ఇప్పటికీ ఆ షోకు పెద్దగా స్పందన లేదు' అని చెప్పుకొచ్చింది.

    English summary
    Sameera Sherief is an Indian television actress and producer who acted in Bharayamani serial and serials like Prathibimbam, Mangamma Gari Manavaralu and played the lead role in the Tamil serial Rekka Katti Parakkudhu Manasu in 2018.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X