Murali Mohan: మురళీ మోహన్ కంటికి యాంకర్ రష్మి అలా కనిపిస్తోందట.. స్టేజీమీదే షాక్!
సీనియర్ హీరో మురళీ మోహన్ గురించి అందరికీ తెలిసింది. అద్భుతమైన నటతో పాటు అంతకు మించిన అణుకువతో చాలా పద్దతిగా నడుచుకునే ఆయనకు తెలుగులో చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన సినిమాల్లో కనిపించకపోయినప్పిటకీ ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ అందిరికీ టచ్ లోనే ఉంటారు. అయితే తాజాగా ఈయన శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు వచ్చారు. అక్కడే యాంకర్ రష్మిని చూస్తే అలా అనిపిస్తుందని చెప్పి అందరికీ షాకిచ్చారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జబర్దస్త్ షో త ర్వాత ఎక్కువ మంది ఆదరిస్తున్న కడుపుబ్బా నవ్వించే షో శ్రీదేవి డ్రామా కంపెనీ. జబర్దస్త్ షోలో చేసే వాళ్లే ఇక్కడకు వచ్చి బుల్లితెర ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అనేక మంది సెలబ్రిటీలను తీసుకు వస్తూ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ వారం రాబోయే ఎపిసోడ్ కోసం.. ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే సీనియర్ హీరో మురళీ మోహన్ తో పాటుగా సీనియర్ హీరోయిన్ జయసుధను తీసుకు వచ్చారు. వారికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఈక్రమంలోనే యాంకర్ రష్మితో పాటు హైపర్ ఆది వారితో మాట్లాడుతూ కనిపించారు.

ముఖ్యంగా మురళీ మోహన్ తో యాంకర్ రష్మి మాట్లాడగా.. ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. నేను మీ షో ఎప్పుడూ చూస్తూ ఉంటానని అన్నారు. సూట్ వేసుకుని మరీ వచ్చిన ఆయన.. యాంకర్ రష్మి తన కంటి ఓ బాలీవుడ్ హీరోయిన్ లా కనిపిస్తుందని చెప్పారు. ఆయన అలా చెప్పగానే రష్మి ఫుల్ సిగ్గుపడిపోతూ బ్లష్ అయింది. అంతటితో ఆయన ఆపకుండా.. పైహర్ ఆది వద్దకు వెళ్లి మరీ నిజం చెప్పాలంటే నేను రష్మికి పెద్ద ఫ్యాన్ ని అంటూ వివరించాడు. ఇదంతా విన్న వాళ్లంతా షాక్ అయ్యారు. తెగ మురిసిపోతూ... రష్మిని ఆకాశానికి ఎక్కించేశారు.

ఇక ఆ తర్వాత మురళీ మోహన్.. అక్కడ జయసుధ, ఇక్కడ మురళీ మోహన్ ఉండండ ఏం బాలేదని చెప్పగానే.. జయసుధ స్టేజీ మీదకు వచ్చారు. ఈక్రమంలోనే ఓ సాంగ్ ప్లే చేశారు నిర్వాహకులు. సిరిమల్లె పూవల్లే నవ్వు అంటూ వచ్చిన పాటకు మురళీ మోహన్ తో పాటు జయసుధ డ్యాన్స్ చేశారు. ఇలా ఆద్యంతం ఆకట్టుకున్న ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 11వ తేదీన రాబోతుంది. మురళీ మోహన్ యాంకర్ రష్మిని ఇంకా ఎంత పొగిడారో తెలయాలంటే ఈ ఎపిసోడ్ పూర్తిగా చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











