Don't Miss!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మూవ్ ఆన్ అయిపోయిన దీప్తి.. షన్నూ మాత్రం దేవదాస్ లాగా.. షోలకు కూడా వెళ్ళకుండా?
దీప్తి సునైనా మరియు షణ్ముఖ్ జస్వంత్ తమ ఐదేళ్ల బంధాన్ని 2022లో ముగించారు. దీప్తి తన ఇన్స్టాగ్రామ్లో జనవరి 1 ముందు రోజు ఒక పోస్ట్ను షేర్ చేసి ఈ వార్తను ప్రకటించింది. అయితే ఆమె మూవ్ ఆన్ అయిందని, ఆమె పెట్టే పోస్టులు బట్టి తెలుస్తోంది. ఆ వివరాలు
తాము విడిపోయి
షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్కి వెళ్లి షో రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే. అతను షోలో ఉన్నప్పుడు, దీప్తి సునైనా అతనికి చాలా మద్దతు ఇచ్చింది. షణ్ణూ ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత, దీప్తి షణ్ముఖ్ను ఎక్కడా కలవలేదు. వీరు కలిసి ఉన్న ఫోటోలు సైతం ఏమీ బయటకు రాలేదు. దీంతో ఈ వ్యవహారం అనేక పుకార్లకు దారితీసింది. చివరగా, జనవరి 1 న, వారిద్దరూ తాము విడిపోయిన వార్తలను ధృవీకరించారు.
నేను పులి మా నాన్న అలా పెంచారు
బ్రేకప్ తర్వాత, దీప్తి సునైనా, షణ్ను నుండి దూరంగా వెళ్లి తన కెరీర్పై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తోంది. లైవ్ సెషన్లో, దీప్తి సునైనా మాట్లాడుతూ, తాను ఇంతకు ముందు తన కెరీర్పై ఎప్పుడూ దృష్టి పెట్టలేదని, కానీ ఇప్పుడు తన వృత్తి జీవితంపై దృష్టి పెట్టాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఇక తాజాగా దీప్తి సునైనా తన ఇన్స్టాగ్రామ్ లో ఈ బ్రేకప్ ప్రకటించి ఒక వారం గడిచిన క్రమంలో 'నేను పులి మా నాన్న అలా పెంచారు' అని రాసి ఉన్న పోస్ట్ను షేర్ చేసింది. అందులో ఆమె బ్రేకప్ కు ముందు తరువాత కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
కారులో డ్రైవ్కు
బిగ్ బాస్ రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. షణ్ముఖ్ తన ఫాలోవర్స్ కు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏదో ఒక అప్డేట్ చేస్తూ ఉంటారు. గురువారం, షణ్ముఖ్ బిగ్ బాస్ లోని తన హౌస్ మేట్ శ్రీరామ చంద్రను కలిశాడు. ఈ ఇద్దరూ కారులో డ్రైవ్కు వెళ్లినట్లు తెలుస్తోంది. శ్రీరామ చంద్ర కారులో ఒక పాట పాడాడు, షణ్ముఖ్ దానిని తన స్టేటస్ లో షేర్ చేశాడు. ఇది బాధాకరమైన పాట కాగా షణ్ముఖ్ దీప్తి సునైనాను చాలా మిస్ అవుతున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఫోన్ నంబర్ను బ్లాక్ చేసి
దీప్తి
సునైనా
తన
ఫోన్
నంబర్ను
బ్లాక్
చేసినందున
ఆమెకు
వివరించే
అవకాశం
లేదని
షణ్ను
ఒక
ఇంటర్వ్యూలో
వెల్లడించాడు.
ఇప్పుడు,
షణ్ముఖ్
గుండె
బ్రేకప్
బాధలో
రెండవ
అవకాశం
కోసం
ఎదురు
చూస్తున్నాడు.
మరోవైపు,
దీప్తి
సునైనా
మాత్రం
గట్టిగానే
ఉంది
మరియు
కెరీర్పై
దృష్టి
పెట్టాలని
ఆమె
నిర్ణయించుకుంది.
లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తు
బిగ్
బాస్
తెలుగు
5
కంటెస్టెంట్స్
షణ్ముఖ్
జస్వంత్,
సిరి
హన్మంత్
టీవీ
రియాలిటీ
షో
నుంచి
వైదొలగిన
తర్వాత
లో
ప్రొఫైల్
మెయింటైన్
చేస్తున్నారు.
షణ్ముఖ్
-సిరి
ఇద్దరూ
హౌస్
లో
రిలేషన్షిప్
కారణంగా
ప్రేక్షకులలో
పాపులర్
అయ్యారు.
నెగిటివిటీ
మూటగట్టుకున్నా
సరే
బిగ్
బాస్
తెలుగు
5
విజేత
VJ
సన్నీ
కంటే
వీరిద్దరూ
ఎక్కువ
మంది
అభిమానులను
సంపాదించుకున్నారు.
Recommended Video
షణ్ముఖ్ మరియు సిరిలను విస్మరించి
షణ్ముఖ్ మరియు సిరి హన్మంత్ ఇద్దరూ ఏదైనా రియాల్టీ షోలో కనిపిస్తే చాలు టీఆర్పీలు దూసుకుపోతాయి. తాజాగా విడుదలైన స్టార్ మా స్టార్ట్ మ్యూజిక్ ప్రోమోను చూస్తే, మెహబూబ్, మౌనిక రెడ్డి మరియు సిరి ప్రియుడు శ్రీహన్ మినహా యూట్యూబర్లందరూ ప్రేక్షకులకు కొత్తవారే. షో నిర్వాహకులు షణ్ముఖ్, సిరిని షోకి ఎందుకు పిలవలేదని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే స్టార్ మా ఇప్పుడు తమ టీఆర్పీల విషయంలో రిస్క్ చేయాలనీ అనుకోవడం లేదు. భీభత్సమైన నెగిటివిటీ మూటకట్టుకున్న షణ్ముఖ్ మరియు సిరిలను విస్మరించిందని అంటున్నారు.