Don't Miss!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
భార్య ఉన్నా గర్ల్ఫ్రెండ్స్తో జల్సా.. రెండో భర్తకు యాక్టర్ గుడ్బై, అందుకోసమే వదిలేశా
టెలివిజన్ నటి శ్వేతా తివారీ తన రెండో భర్త అభివవ్ కోహ్లీపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసింది. తన వ్యక్తిగత జీవితం, పిల్లల భవిష్యత్పై ఎలాంటి చెడు ప్రభావం పడకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకొన్నానని చెప్పింది. ఈ వ్యవహారంపై కొద్ది రోజులుగా పెదవి విప్పని ఈ నటి తాజాగా మేరే డాడ్ కీ దుల్హన్ కొత్త సీరియల్ ప్రారంభం సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ రెండో భర్తతో ఎందుకు విడిపోవాలని అనుకొంటున్నానో చెప్పింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే...
రెండో వివాహంలో కూడా సమస్యలు
నటి శ్వేతా తివారి 2013లో అభినవ్ కోహ్లితో రెండో వివాహం జరిగింది. అంతకు ముందు రాజ చౌదరీ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. అభిప్రాయ విభేదాల కారణంగా వారిద్దరు విడిపోయారు ఆ తర్వాత కోహ్లీతో జరిగిన పెళ్లి కూడా సమస్యల్లో కూరుకుపోయింది. తన రెండో భర్తతో తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాను. సమస్యలు తగ్గకుపోగా మరింత పెరగడంతో తీవ్రమైన నిర్ణయం తీసుకొని సమత నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాను అని వెల్లడించింది.
మీడియా ఏం రాసుకొన్నా పట్టించుకోను
నా వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం గురించి మీడియా ఏం రాసుకొన్నా నేను పట్టించుకోను. కానీ నా పిల్లల భవిష్యత్తు మాత్రమే నాకు ముఖ్యం. వారిపై ఎలాంటి ప్రభావం పడకుండా మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రెండో వివాహంలో కూడా సమస్యనా? అలా జరగకూడదే అనే ప్రశ్న వేస్తున్నారు. ఎందుకు సమస్య తలెత్తదు. అయినా నా సమస్యను పరిష్కరించుకోవడానికి నేను ధైర్యంగా నిలబడుతా. మీడియా ఏం రాసుకొన్నా నేను పెద్దగా పట్టించుకోను అని శ్వేతా తివారీ ఫైర్ అయ్యారు.
నేను దేనికి భయపడను
మీడియా నా గురించి ఎన్ని రాసినా.. నేను భయపడను. నేను భయపడేది కేవలం నా పిల్లల గురించి. నాకు వారే ప్రపంచం. అలాంటి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నేను చూసుకొంటాను. వాళ్లు గొప్పగా వారి జీవితాల్లో స్థిరపడేలా నేను జాగ్రత్తలు తీసుకొంటాను. కొందరు తమ భర్తలను చీట్ చేసే వారి కంటే నేను బెటర్. నా జీవితంలో సుఖ:శాంతులు లేని రిలేషన్ను తెగతెంపులు చేసుకొంటాను అని శ్వేతా తివారీ పేర్కొన్నారు.
అందరి జాతకాలు బయటపెడుతా..
సినిమా పరిశ్రమలో చాలా మంది జీవితాల గురించి నాకు తెలుసు. కావాలంటే వారి జాతకాలు బయపెట్టగలను. చాలా మంది భార్యలను పెట్టుకొని గర్ల్ఫ్రెండ్తో తిరిగే వాళ్లు ఉన్నారు. అలాగే భర్తలతో సంసారం చేస్తూ బాయ్ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు. వారి కంటే నేను బెటర్. నా భర్త వ్యవహారం నాకు నచ్చలేదు. అందుకే బయటకు వచ్చి నీతో ఉండలేనని చెప్పాను. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తా. మీడియా, సమాజం ఏమనుకొన్నా నేను పట్టించుకోను అని ఘాటుగా శ్వేత తివారీ వ్యాఖ్యలు చేసింది.
Recommended Video
వివాహిత మహిళల కోసం
వివాహాల వల్ల బాధపడే మహిళల కోసం ఓ వేదికను ఏర్పాటు చేసి దాని కోసం పనిచేస్తాను. మహిళలకు వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకొంటాను. సమాజం ఏమనుకొంటుంది.. పక్కింటి వాళ్లు ఏమనుకొంటారనే విషయాన్ని పట్టించుకోకుండా మీ సమస్యల నుంచి బయటకు రండి అంటూ మహిళలకు శ్వేతా తివారీ పిలుపునిచ్చింది. అంతే కాకుండా నా పిల్లల భవిష్యత్ కోసం జాగ్రత్తలు తీసుకొంటానని చెప్పింది.