Don't Miss!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Lifestyle తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..! మన పుట్టినరోజున అందరికంటే ఎక్కువ సంతోషపడేది అమ్మ..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
2020లో బుల్లితెరదే హవా.. వెలవెలబోయిన వెండితెర
2020 ఏడాది ముగిసేందుకు వచ్చింది. మొత్తానికి ఈ ఏడాదిలో వెండితెర మాత్రం వెలవెలబోయింది. మొదటి రెండు మూడు నెలలు బాగానే కలిసిసొచ్చినట్టుగా సినిమాలు హిట్ అయ్యాయి. బాక్సాఫీస్ కళకళలాడుతూ వచ్చింది. కానీ మార్చిలో కరోనా ఉధృతి పెరగడం, లాక్డౌన్ విధించడంతో అంతా తారుమారైంది. మార్చిలో మూత బడిని థియేటర్లకు ఇప్పటి వరకు మోక్షం కలగలేదు. ఇన్ని నెలల తరువాత ఈ రోజు టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుంది. సోలో బ్రతుకే సో బెటర్ అంటూ థియేటర్లలో సందడి కనిపిస్తోంది.
కానీ మార్చి నుంచి మాత్రం బుల్లితెర తన హవాను కొనసాగించింది. లాక్డౌన్ సమయంలో బుల్లితెర వీక్షకుల సంఖ్య రెట్టింపైంది. మామూలుగా చూసే సంఖ్య కంటే రెండు మూడు రెట్లు ఎక్కువయ్యారట. టీఆర్పీల్లో బుల్లితెర ఈ ఏడాది కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. లాక్డౌన్కు జనాలు అలవాటు పడాలని పాత ధారావాహికలను కూడా ప్రసారం చేయించింది ప్రభుత్వం. నాటి మహాకావ్యాలైన రామాయణ, మహాభారతాలను పున: ప్రసారం చేయించింది.
అంతే కాకుండా పాత చిత్రాలు, నాటి క్లాసిక్ మూవీలను వేస్తూ జనాలను బుల్లితెర అతుక్కుపోయేలా చేశారు. మొత్తానికి జనాలకు లాక్డౌన్ సమయంలో ఓటీటీ లేదా బుల్లితెర మాత్రమే దిక్కుగా తోచింది. అందుకే అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక బుల్లితెర పరిశ్రమ సందడి జోరందుకుంది. సినిమా రేంజ్లకు తగ్గట్టుగా పండుగలకు స్పెషల్ ఈవెంట్లను ప్లాన్ చేశారు. మొత్తానికి ఈ ఏడాదిలో 75 శాతం బుల్లితెర హవానే కొనసాగిందని చెప్పవచ్చు.