Don't Miss!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
2020లో బుల్లితెరదే హవా.. వెలవెలబోయిన వెండితెర
2020 ఏడాది ముగిసేందుకు వచ్చింది. మొత్తానికి ఈ ఏడాదిలో వెండితెర మాత్రం వెలవెలబోయింది. మొదటి రెండు మూడు నెలలు బాగానే కలిసిసొచ్చినట్టుగా సినిమాలు హిట్ అయ్యాయి. బాక్సాఫీస్ కళకళలాడుతూ వచ్చింది. కానీ మార్చిలో కరోనా ఉధృతి పెరగడం, లాక్డౌన్ విధించడంతో అంతా తారుమారైంది. మార్చిలో మూత బడిని థియేటర్లకు ఇప్పటి వరకు మోక్షం కలగలేదు. ఇన్ని నెలల తరువాత ఈ రోజు టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుంది. సోలో బ్రతుకే సో బెటర్ అంటూ థియేటర్లలో సందడి కనిపిస్తోంది.
కానీ మార్చి నుంచి మాత్రం బుల్లితెర తన హవాను కొనసాగించింది. లాక్డౌన్ సమయంలో బుల్లితెర వీక్షకుల సంఖ్య రెట్టింపైంది. మామూలుగా చూసే సంఖ్య కంటే రెండు మూడు రెట్లు ఎక్కువయ్యారట. టీఆర్పీల్లో బుల్లితెర ఈ ఏడాది కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. లాక్డౌన్కు జనాలు అలవాటు పడాలని పాత ధారావాహికలను కూడా ప్రసారం చేయించింది ప్రభుత్వం. నాటి మహాకావ్యాలైన రామాయణ, మహాభారతాలను పున: ప్రసారం చేయించింది.
అంతే కాకుండా పాత చిత్రాలు, నాటి క్లాసిక్ మూవీలను వేస్తూ జనాలను బుల్లితెర అతుక్కుపోయేలా చేశారు. మొత్తానికి జనాలకు లాక్డౌన్ సమయంలో ఓటీటీ లేదా బుల్లితెర మాత్రమే దిక్కుగా తోచింది. అందుకే అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక బుల్లితెర పరిశ్రమ సందడి జోరందుకుంది. సినిమా రేంజ్లకు తగ్గట్టుగా పండుగలకు స్పెషల్ ఈవెంట్లను ప్లాన్ చేశారు. మొత్తానికి ఈ ఏడాదిలో 75 శాతం బుల్లితెర హవానే కొనసాగిందని చెప్పవచ్చు.