Don't Miss!
- News జగన్ ను జైల్లో పెట్టావ్.. పుట్టపర్తి సాయిబాబా సంపదంతా దోచుకున్నావ్: తగ్గని మంత్రి పెద్దిరెడ్డి
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
2000 వేల కోట్లకు, ఛానెల్ ని అమ్మకానికి పెట్టిన జీ టీవి
డిల్లీ: ఛానెళ్లు కొనుగోళ్లు, అమ్మకాలు, ఇండియన్ టెలివిజన్ రంగంలోనూ చాలా కామన్ విషయాలుగా మారుతున్నాయి. పెద్ద ఛానెల్స్ లాభసాటి బేరాలకు కొత్త ఛానెల్స్ ని తమలో కలుపుకోవటం, భారం అనిపించే ఛానెల్స్ ని అమ్మేయడం చేస్తున్నాయి.
తాజాగా ఇండియా మీడియా రంగంలో మరో భారీ అమ్మకానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జడ్ఈఈఎల్) టెన్ స్పోర్ట్స్ ఛానల్ను వెల్లడించిన ధరకు అమ్మకానికి పెట్టింది. ఈ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు జీ సంస్థ బీఎస్ఈకి తెలిపింది.
కాగా ఛానళ్లను ఎవరికి విక్రయిస్తున్నారనేది మాత్రం రహస్యంగా ఉంచింది. దీనికి సంబంధించిన ఆర్థిక వివరాలను సైతం సంస్థ వెల్లడించలేదు.
టెన్ స్పోర్ట్స్ను రూ.2000 కోట్లకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా కొనుగోలు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దుబాయ్కి చెందిన అబ్దుల్ రహ్మాన్ తాజ్ గ్రూప్ నుంచి టెన్స్పోర్ట్స్ను జీ సంస్థ 2006లో కొనుగోలు చేసింది.