twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓడిపోయినా అనుకున్నది సాధించిన శ్రీముఖి.. వీడియో పోస్ట్ చేసి మరీ చెప్పింది

    By Manoj Kumar P
    |

    పదిహేను వారాల పాటు జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ -3 గత ఆదివారం ముగిసింది. ఇందులో ప్రముఖ సింగర్ రాహుల్ సింప్లిగంజ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన ఫేవరెట్ కంటెస్టెంట్ శ్రీముఖి మాత్రం రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి సీజన్ ప్రారంభం నుంచీ శ్రీముఖినే విజయం సాధిస్తుందని చాలా మంది అనుకున్నారు.

    అందుకు అనుగుణంగానే ఆమె అన్ని టాస్కుల్లో మంచి ప్రదర్శనలు కూడా ఇచ్చింది. కానీ, ప్రేక్షకులు మాత్రం రాహుల్‌కే జై కొట్టడంతో ఆమెకు నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో శ్రీముఖి తాజాగా చేసిన ఓ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఆ పోస్ట్ దేనికి సంబంధించినది.? పూర్తి వివరాల్లోకి వెళితే..

    భారీగా సంపాదించింది

    భారీగా సంపాదించింది

    శ్రీముఖి బిగ్ బాస్ సీజన్‌ -3లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అంతేకాదు, హౌస్‌లో ఉన్న వారందరిలో ఆమెకే ఎక్కువ ఫాలోయింగ్ ఉండడంతో, షో నిర్వహకులు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా ఇచ్చారని ప్రచారం జరిగింది. దీంతో ఈ సీజన్‌లో అందరి కంటే ఆమెకే ఎక్కువ మొత్తం దక్కిందన్న టాక్ వినిపించింది. దీంతో శ్రీముఖి బాగా సంపాదించిందని గుసగుసలు వినిపించాయి.

    విన్నర్ కంటే ఎక్కువే

    విన్నర్ కంటే ఎక్కువే

    ఈ షోలో విన్నర్‌గా నిలిచిన రాహుల్ సింప్లిగంజ్‌ కంటే శ్రీముఖికే ఎక్కువ మొత్తం దక్కిందన్న ప్రచారమూ జరిగింది. రాహుల్ గెలుచుకున్న రూ. 50 లక్షల ప్రైజ్ మనీలో దాదాపు రూ. 15 లక్షలు టాక్సుల రూపంలో కట్ అయ్యాయట. దీంతో అతడికి రూ. 35 లక్షలు మాత్రమే దక్కాయని అంటున్నారు. ఇవి కాక, రోజు వారీగా ఇచ్చే రెమ్యూనరేషన్ కలుపుకున్నా శ్రీముఖి అంత రాలేదని తెలుస్తోంది.

    గెలిస్తే ఆ పని చేస్తానంది

    ఈ సీజన్‌లో విజయం సాధిస్తే ప్రైజ్ మనీగా వచ్చిన రూ. 50 లక్షలతో ఎవరు ఏం చేస్తారని ఓ ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున హౌస్‌మేట్లను ప్రశ్నించాడు. దీనికి శ్రీముఖి ‘ఇన్ని రోజులు నన్ను ఏ కష్టం లేకుండా చూసుకున్న మా అమ్మానాన్నకు ఇచ్చేస్తాను. ఆ తర్వాత ఆ డబ్బులలోని కొంత మొత్తంతో నాకెంతో ఇష్టమైన మాల్దీవులు టూర్ వెళ్తాను' అని వెల్లడించింది.

    అనుకున్నది సాధించింది

    అనుకున్నది సాధించింది

    ఈ సీజన్‌లో శ్రీముఖి ఓడిపోయినప్పటికీ అనుకున్నది సాధించింది. గతంలో వెల్లడించినట్లుగానే బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన డబ్బులతో ఆమె మాల్దీవులు టూర్ వెళ్లింది. ఆమెతో పాటు సోదరుడు, మరికొందరు స్నేహితులు ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అందరూ శ్రీముఖి గురించి చర్చించుకుంటున్నారు.

    English summary
    Telugu Biggest Reality Show Bigg Boss 3 Telugu runner up Sreemukhi left for the Maldives along with her brother Sushruth and close friends on a vacation after staying in the Bigg Boss house for 100 days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X